భవిష్యత్తుతో ఆటలు
జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉన్న రాష్ట్ర క్రీడా పాఠశాల నిర్వహణ గాడితప్పుతోంది. కరోనా, నిధుల కొరత, సిబ్బంది లేమి.. తదితర కారణాలతో ఇప్పటికే పలుమార్లు మూతపడగా.. తాజాగా జీతాలు లేవని కొందరిని తొలగించడంతో మరోసారి గేట్లు పడ్డాయి.
మళ్లీ మూతపడిన రాష్ట్ర క్రీడా పాఠశాల
మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణ పనులు
విజయనగరం క్రీడలు, న్యూస్టుడే: జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉన్న రాష్ట్ర క్రీడా పాఠశాల నిర్వహణ గాడితప్పుతోంది. కరోనా, నిధుల కొరత, సిబ్బంది లేమి.. తదితర కారణాలతో ఇప్పటికే పలుమార్లు మూతపడగా.. తాజాగా జీతాలు లేవని కొందరిని తొలగించడంతో మరోసారి గేట్లు పడ్డాయి. సిబ్బంది లేకుండా నడపలేమని, పర్యవేక్షణ కష్టతరమవుతోందని జిల్లా అధికారులు కూడా చేతులెత్తేశారు. ఈక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పరిస్థితి ఇదీ..
క్రీడల్లో రాణించే ప్రతిభావంతులైన పిల్లలకు విద్యతో పాటు వివిధ క్రీడా అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో విజ్జీ మైదానంలో సుమారు రూ.20 కోట్లతో క్రీడా పాఠశాలను ఏర్పాటుకు నిర్ణయించారు. తొలి విడతగా పది శాతం నిధులు మంజూరయ్యాయి. ఇంతలో కొందరు చేరగా, వారికి ఇబ్బంది లేకుండా విజ్జీ ప్రాంగణంలోనే ఒక తాత్కాలిక భవనాన్ని తీసుకొని తరగతులు సైతం ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తరగతులు మాత్రం కొనసాగేవి. ఈక్రమంలో కరోనా రావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపేశారు. ఇటీవల రాజీవ్ మైదానం వేదికగా మళ్లీ ప్రారంభించారు. నిధులు లేవని మళ్లీ ఆపేశారు.
తొలగింపు: విద్యాశాఖ ద్వారా ఇద్దరు ఉపాధ్యాయులను, క్రీడాశాఖ ద్వారా పలువురు శిక్షకులను తీసుకున్నారు. 2018లో పాఠశాల నిర్వహణ నిమిత్తం 11 మందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. తాజాగా జీతాలు ఇవ్వడానికి బడ్జెట్ లేదని ఈ 11 మందిలో ఏడుగురిని తొలగించారు.
ఇబ్బంది లేదు..
ప్రస్తుతానికి సెలవులు ఇచ్చాం. త్వరలోనే ప్రారంభిస్తాం. జీతాలు, బడ్జెట్ వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తాం. పాఠశాల నిర్మాణానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి. - ఎస్.వెంకటేశ్వరరావు, క్రీడా శాఖ ముఖ్య శిక్షకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ఫిర్యాదుల కోసం సంప్రదించండి
[ 26-04-2024]
ఎన్నికల ఫిర్యాదుల కోసం 08922-797120, 08922- 797124 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. -
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!