logo

తెదేపా కురుపాం ఇన్‌ఛార్జిగా జగదీశ్వరి

తెదేపా కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట ఎంపీటీసీ సభ్యురాలు తోయక జగదీశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇన్‌ఛార్జులుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే జనార్దన థాట్రాజు

Published : 26 Jan 2022 06:22 IST

 

పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: తెదేపా కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట ఎంపీటీసీ సభ్యురాలు తోయక జగదీశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇన్‌ఛార్జులుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే జనార్దన థాట్రాజు, అతని తల్లి నరసింహ ప్రియాథాట్రాజు మృతి చెందారు. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో జగదీశ్వరిని నియమించారు. ఈమెది రాజకీయ కుటుంబం కావడం, శత్రుచర్ల కుటుంబానికి సన్నిహితంగా ఉండటంతో బాధ్యతలు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని