ఉద్యోగోన్నతులు గురూ..!
ప్రభుత్వ, జడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ, పాఠశాల సహాయకుల ఉద్యోగోన్నతులకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. సీనియార్టీ జాబితాల విడుదల, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించనుంది. ఈ నెల ఏడో తేదీన ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా విడుదల చేస్తుంది.
ఉమ్మడి జిల్లాలో 132 మందికి అవకాశం
హేతుబద్ధీకరణతో తగ్గిన అవకాశాలు
ధ్రువపత్రాల పరిశీలన (పాత చిత్రం)
విజయనగరం విద్యా విభాగం, న్యూస్టుడే: ప్రభుత్వ, జడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ, పాఠశాల సహాయకుల ఉద్యోగోన్నతులకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. సీనియార్టీ జాబితాల విడుదల, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించనుంది. ఈ నెల ఏడో తేదీన ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా విడుదల చేస్తుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత పదో తేదీన తుది జాబితా ప్రదర్శిస్తారు. 11, 12 తేదీల్లో ఉద్యోగోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు ఉపాధ్యాయులకు ఇస్తారు. ఈ నెల 13 వరకూ దీన్ని కొనసాగిస్తారు. విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల్ని పరిశీలించారు. హేతుబద్ధీకరణ వల్ల ఉమ్మడి జిల్లాలో 132 మందికి ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ గణాంకాల బట్టి తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి: పాఠశాల సహాయకులు(హిందీ)లో కొరత ఉన్న 25 పోస్టుల్లో 70 శాతం కోటా కింద 15 మందికే ఉద్యోగోన్నతి లభించనుంది. ఎస్జీటీలో హిందీ చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు. బీ పీడీ పోస్టుల్లో పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు)లకు ఉద్యోగోన్నతి కల్పిస్తారు. ఎస్జీటీల్లో బీపీఈడీ చేసిన వారికి పీడీగా అవకాశం ఇవ్వాలనుకున్నా...అభ్యర్థులు లేకపోవడంతో 72 పోస్టులు ఖాళీగానే ఉండిపోనున్నాయి.
6న పరిశీలన
పాఠశాల సహాయకుల హిందీకి అర్హులైన వారికి ఉద్యోగోన్నతిని కల్పించనున్నాం. ఈ నెల 6న డీఈవో కార్యాలయంలో అర్హుల ధ్రువపత్రాలను పరిశీలిస్తాం. ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చాం.
- కె.వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జి డీఈవో
ఉపాధ్యాయుల కొరతతో...: హేతుబద్ధీకరణతో కొన్ని కేడర్లలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మిగులు పోస్టుల్ని సర్దుబాటు చేయగా తొలుత గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకుల ఆంగ్లం, పీడీ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా పాఠశాల సహాయకుల హిందీ సబ్జెక్టులోనూ ఉద్యోగోన్నతులు కల్పించాలని ఆదేశాలు రావడంతో సీనియార్టీ జాబితా ప్రకారం ఉపాధ్యాయుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు