మీరే చెప్పండి ఎలా బతకాలో!
‘అయ్యా.. మేమంతా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని దిశ వన్స్టాప్ సెంటర్ (సఖి)లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులం.
కలెక్టరేట్ వద్ద ఎంపీని కలిసిన ఒప్పంద ఉద్యోగులు
ఎంపీకి వినతిపత్రం అందిస్తున్న సఖి సిబ్బంది
కలెక్టరేట్, న్యూస్టుడే: ‘అయ్యా.. మేమంతా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని దిశ వన్స్టాప్ సెంటర్ (సఖి)లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులం. మహిళల సమస్యలపై 24 గంటలూ సేవలందిస్తున్నాం. మాకు జీతాలొచ్చి 14 నెలలైంది. చాలీచాలని వేతనాలైనా ప్రభుత్వ ఉద్యోగమన్న ఆశతో పనిచేస్తున్నాం. మీరైనా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సక్రమంగా జీతాలొచ్చేలా చూడాలని’ ఉద్యోగులు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు విజ్ఞప్తి చేశారు.
న్యాయం చేయరూ...!
చెరువును రక్షించాలని కోరుతున్న జొన్నాడ ప్రాంత రైతులు
‘డెంకాడ మండలం జొన్నాడ వద్ద రహదారిని ఆనుకుని లింగడబంద ఉంది. ఈ చెరువు నీటిని ఆధారం చేసుకుని తాత, తండ్రుల నుంచి దిగువన వ్యవసాయ భూములను సాగుచేసుకుంటున్నాం. ప్రభుత్వ రికార్డుల్లోనూ గతంలో చెరువుగానే నమోదై ఉంది. కానీ.. ఇప్పుడు కొందరు ఈ నీటిని మళ్లించి, ఆ ప్రాంతాన్ని వ్యవసాయ భూమిగా మార్చి వాళ్లదని చెబుతూ రెవెన్యూ రికార్డుల్లోనూ మార్చేశారు. మండలాధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదు. మీరైనా న్యాయం చేయండ’ని జొన్నాడకు చెందిన పలువురు రైతులు, మహిళలు ‘స్పందన’లో విజ్ఞప్తి చేశారు.
‘స్పందన’కు 157 వినతులు
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘స్పందన’కు 157 వినతులు అందాయి. అర్జీదారుల నుంచి కలెక్టర్ ఎ.సూర్యకుమారితో పాటు, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో గణపతిరావు, ఉప కలెక్టర్లు సుదర్శనదొర, సూర్యనారాయణ తదితరులు వినతులు స్వీకరించారు.
తాళిబొట్టు అమ్మి పునాదులేశా
‘2009లో సోనియానగర్ వద్ద ఇంటి పట్టా ఇచ్చారు. అప్పట్లో ఇల్లు కట్టాలని చెబితే తాళిబొట్టు అమ్మి, కొంత నిర్మించాం. ఇప్పుడు అదే ప్రాంతంలో టిడ్కో ఇళ్లు ఉన్నాయంటున్నారు. నా గురించి అడిగితే.. సమాధానం ఇవ్వడం లేదు.’ అని నగరానికి చెందిన కటారి రూపాదేవి వాపోయారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎ.సూర్యకుమారిని వేడుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్