పాడి అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు
ఉమ్మడి జిల్లాలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పశువులకు కొన్నాళ్లుగా ప్రబలుతున్న ముద్దచర్మ వ్యాధి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా రాయితీపై సరఫరా చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ ఉప సంచాలకుడు ఆర్.నీలయ్య తెలిపారు.
న్యూస్టుడే, బొబ్బిలి: ఉమ్మడి జిల్లాలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పశువులకు కొన్నాళ్లుగా ప్రబలుతున్న ముద్దచర్మ వ్యాధి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా రాయితీపై సరఫరా చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ ఉప సంచాలకుడు ఆర్.నీలయ్య తెలిపారు. రానున్న సీజన్లో తమ శాఖ చేపట్టబోయే ప్రణాళికలపై ఆయన ఆదివారం ‘న్యూస్టుడే’తో ముచ్చటించారు.
రాయితీపై దాణా..
ఏటా వేసవిలో పశుగ్రాసం కొరత పాడి రైతులను వేధిస్తోంది. అధిక ధరకు కొనుగోలు చేయలేక పశువులను అమ్మేస్తుండడంతో పాల ఉత్పత్తి తగ్గుతోంది. దీనిని నియంత్రించేందుకు పౌషకాలతో కూడిన దాణాను రాయితీపై అందిస్తున్నాం. కిలో రూ.52 విలువ చేసే ప్యాకెట్ రూ.38లకే ఇస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా, బొబ్బిలి డివిజన్లో 76 టన్నుల మేర అందజేస్తాం. చేయూత పథకంలో భాగంగా రైతులు పశువులు కొని ఉపాధి పొందొచ్చు.
పూర్తిస్థాయిలో టీకాలు
రెండు జిల్లాల్లో ముద్ద చర్మవ్యాధి సమీప ఒడిశా సరిహద్దు నుంచి వ్యాపించింది. ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇంకా కొన్నిచోట్ల కేసులు బయటపడుతున్నాయి. నిర్మూలనకు సుమారు లక్ష డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేశాం. వ్యాధి పూర్తి నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
393 కేంద్రాల్లో పాలసేకరణ
తమ పరిధిలో 393 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 353కి స్థల సేకరణ పూర్తయింది. మిగిలిన వాటికి సంబంధించి గుర్తించాల్సి ఉంది. ఆపై నిర్మాణాలు చేపట్టాక సేకరణ ప్రారంభిస్తాం. విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సేకరించిన పాలను నిల్వ చేసేందుకు కూడా కొన్ని కేంద్రాలను గుర్తించాం. వాటి నిర్మాణానికి స్థల సేకరణ జరుగుతోంది.
పాడి ఉత్పత్తికి చర్యలు
మన్యం జిల్లా, బొబ్బిలి డివిజన్ పరిధిలో మొత్తం 2,18,635 పశు సంపద ఉంది. పాడి అభివృద్ధి చేసేందుకు ఆడదూడల ఉత్పత్తి పథకంలో భాగంగా కృత్రిమ గర్భధారణ కోసం రెండు వీర్యనాళికలను రాయితీపై అందిస్తున్నాం. దీని ధర రూ.1600 కాగా రాయితీపై రూ.500 లకే ఇస్తాం. ఒకవేళ ఆడదూడలు పుట్టకపోతే రైతు చెల్లించిన డబ్బులు వాపసు చేస్తాం. జెర్సీ రకాలకు సంబంధించిన చూడు కడుతున్నాం. దీనివల్ల పాడి ఉత్పత్తి పెరుగుతుంది. రైతుకు మెరుగైన ఆదాయం వస్తోంది. మినీ గోకులాల పనులు 72 చోట్ల జరుగుతున్నాయి. ఇటీవలే బిల్లులు చెల్లించాం. కొన్నిచోట్ల సాంకేతిక కారణాలతో నిలిచాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఉంది. ఎవరైనా తరలిస్తే చర్యలు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి