చీపురుపల్లిలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్?
చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో చిరుధాన్యాల శుద్ధీకరణ (మిల్లెట్ ప్రాసెసింగు) యూనిట్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
స్థలం పరిశీలిస్తున్న డీఆర్డీఏ పీడీ, రెవెన్యూ అధికారులు
చీపురుపల్లి గ్రామీణం, న్యూస్టుడే: చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో చిరుధాన్యాల శుద్ధీకరణ (మిల్లెట్ ప్రాసెసింగు) యూనిట్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా గ్రామీణాభివృద్ధి పథక సంచాలకుడు కల్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలసి పెదనడిపల్లిలో స్థలం పరిశీలించారు. గ్రామానికి సంబంధించి చీపురుపల్లి తహసీల్దారు ఎం.సురేష్ సర్వే నెంబరు 78లోని ప్రభుత్వ భూమిని పీడీకి చూపించారు. ఎంత స్థలం అవసరమో వివరించారు. యూనిట్ ఏర్పాటైతే అవసరమైన రవాణా సదుపాయాలపై వెలుగు ఏపీఎం ఎంవీ రాజశేఖర్ వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ పెదనడిపల్లిలో యూనిట్ ఏర్పాటు కోసం భూమి పరిశీలించేందుకు వచ్చామన్నారు. జిల్లాకు సంబంధించి మంజూరైన ఒక యూనిట్ను ఇక్కడ పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. పైగా పరిశ్రమకు కావాల్సిన ముడి సరకు ఇతర మండలాలతో పోలిస్తే చీపురుపల్లి పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా లభించే అవకాశాలు ఉండడంతో సాధ్యమైనంత వరకు ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి పరిశీలన తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఈయన వెంట డీఆర్డీఏ ఏపీడీ సావిత్రి, ప్రాంతీయ వెలుగు సమన్వయకర్త సీతారామయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆర్ఐ రామ్కుమార్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!