పనికో రేటు.. అదే రూటు
విజయనగరం నగరపాలక సంస్థగా ఎదిగిన తర్వాత ప్రజలకు పారదర్శకమైన సేవల మాటెలా ఉన్నా.. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారని, సంస్థను కీలక ప్రజాప్రతినిధి తన గుప్పెట్లో పెట్టుకున్నారని.. అధికారులను కీలుబొమ్మలుగా మార్చారని..
ఇదీ పట్టణ ప్రణాళికా విభాగం తీరు
ఈనాడు-విజయనగరం, న్యూస్టుడే-విజయనగరం పట్టణం
విజయనగరం నగర పాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగం
విజయనగరం నగరపాలక సంస్థగా ఎదిగిన తర్వాత ప్రజలకు పారదర్శకమైన సేవల మాటెలా ఉన్నా.. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారని, సంస్థను కీలక ప్రజాప్రతినిధి తన గుప్పెట్లో పెట్టుకున్నారని.. అధికారులను కీలుబొమ్మలుగా మార్చారని.. ఏ చిన్న పనికైనా అక్కడ నుంచి అనుమతి తప్పనిసరి అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో ఏ నిర్మాణాకైనా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ఇక్కడి నుంచి బదిలీలు, పదోన్నతులపై వెళ్లిన వారి స్థానాలను భర్తీ చేయలేదు. ప్రస్తుతం వార్డు సచివాలయాలు, ఇతర విభాగాల్లోని ఉద్యోగులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన టీపీవో సహా నాలుగు టీపీబీఓ పోస్టులు ఖాళీ. ఇద్దరు టీపీఎస్లకు ఒకరే ఉన్నారు. గతంలో నలుగురు ఛైన్మెన్లు డివిజన్లను పర్యవేక్షించేవారు. ఇప్పుడు వారిని కార్యాలయానికే పరిమితం చేశారు. వార్డు ప్లానింగ్ కార్యదర్శులు నిర్మాణాల్లో ఉల్లంఘనలు పరిశీలిస్తున్నారు. ప్లాన్ల మంజూరు సచివాలయాల ద్వారా లైసెన్సు సర్వేయర్లతో చేయిస్తున్నారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పరిశీలించాలి. అనుమతి లేని వాటిని గుర్తించి యజమానులకు నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత ఛార్జిషీటు దాఖలు చేసి కోర్టు ద్వారా అపరాధ రుసుము వసూలు చేయాలి. ఎక్కడా వీటి ఊసే లేదు. గతేడాది జనవరి నాటికి 1,100 నిర్మాణాల్లో ఉల్లంఘనలు గుర్తించినా ఒక్క ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంపై అప్పటి మున్సిపల్ ఆర్జేడీ మీనాకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు.
చూసీచూడనట్లు..
నగరంలో నిబంధనలు పాటించకుండా వాణిజ్య కేటగిరి భవనాలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ, పురపాలక స్థలాలు, గెడ్డలు ఆక్రమించుకుంటున్నారు. ఈ ఆక్రమణల వెనుక పెద్దల అండ ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా వారు జేబులు నింపుకొంటున్నారు. ఇద్దరు సహాయక సిటీ ప్లానర్లు ఉద్యోగోన్నతి ప్రయత్నాల్లో తరచూ సెలవులు పెట్టడంతో కింది స్థాయి ఉద్యోగి ఒకరు అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. మరో ఇద్దరు అధికారుల్లో ఒకరిని భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు పరిశీలనకు దూరం పెట్టారు.
భవన నిర్మాణాల్లో అన్నీ సక్రమంగా ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలి. వాణిజ్య భవనాల విషయంలో అలా జరగడం లేదు. నివాస గృహాలకు కనీసం 30 అడుగులు, వాణిజ్య భవనాలకు 40 అడుగుల రహదారి తప్పనిసరి. వెయ్యి చదరపు మీటర్ల వరకు నగర పాలక సంస్థ అనుమతిస్తోంది. ఆ తర్వాత వీఎంఆర్డీఏ అనుమతి తప్పనిసరి.
నిబంధనలు పాటించని వాటి వివరాలు
- 2020 అక్టోబరు తర్వాత ఉల్లంఘన నిర్మాణాలు : 554
- ఛార్జిషీట్కు ఎంఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నవి : 120
- గతేడాది మంజూరైన ప్లాన్లు : 650
- ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మంజూరు : 121
నిరంతర పర్యవేక్షణ
నగరంలో జరుగుతున్న నిర్మాణాలపై ప్లానింగ్ కార్యదర్శులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని ఆదేశించాం. వివిధ నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ మంజూరైనదీ, లేనిదీ మూడో పార్టీ తెలుసుకునే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. నగర పరిధిలో ఆక్రమణలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
ఎం.మల్లయ్యనాయుడు, కమిషనరు, నగర పాలక సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ఫిర్యాదుల కోసం సంప్రదించండి
[ 26-04-2024]
ఎన్నికల ఫిర్యాదుల కోసం 08922-797120, 08922- 797124 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. -
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్