పునరావాసంలో జగన్మోసం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు.
నిర్వాసితుల కాలనీలపై నిర్లక్ష్యం
పాలకుల మాట.. నీటి మూటే!
న్యూస్టుడే, భోగాపురం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. అక్కడ ఏ వీధిలో చూసినా సమస్యలు కోకొల్లలు.. పునరావాస ప్యాకేజీ పేరుతో నిర్వాసితులకు మాయ మాటలు చెప్పి మోసగించిన పరిస్థితి. అన్నీ మేమే కట్టేస్తాం.. అందమైన నగరంగా మార్చేస్తామన్న నాయకులు, అధికారులు అటువైపు తొంగి చూడటం లేదు. నిర్వాసితుల గోడు వినే నాథుడే కనిపించడం లేదు.
సమస్యలు కోకొల్లలు
నిర్వాసితులను పునరావాస కాలనీలకు హుటాహుటిన తరలించిన అధికారులు వారి గురించి పట్టించుకోవడం లేదు. ఆయా కాలనీల్లో పరిస్థితులు, సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఇళ్ల మధ్య రాళ్ల గుట్టలు అలాగే ఉన్నాయి. కాలువల్లో బండరాళ్లు, చెత్తచెదారం పేరుకు పోయి ఉన్నాయి. మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాని ఇళ్లల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.
లింగాలవలస కాలనీలో నిర్వాసితుల గృహాల మధ్య తొలగించని గుట్ట
వలసదారులకు కన్నీళ్లే...
మరడపాలెం, బొల్లింకలపాలెం, ముడసర్లపేట గ్రామాలకు చెందిన సుమారు 80 కుటుంబాల వారు స్థానికంగా జీవనోపాధి లేక విజయవాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలకు వలసబాట పట్టారు. ఇక్కడే ఉన్న ఇళ్లకు వచ్చిపోతుంటారు. వీరి ఆధార్, రేషన్, ఓటరు కార్డులన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. ప్రతి నెలా ఊరికి వచ్చి సరకులు విడిపించుకోవడం ఇబ్బందిగా ఉందని.. కొందరు రేషన్ కార్డులను వలస వెళ్లిన చోటుకు బదిలీ చేయించుకున్నారు. వీరంతా నివాసాలను కోల్పోయినా.. స్థానికులు కాదంటూ పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. గ్రామాల్లో ఇళ్లను కూల్చి వేసిన సమయంలో ఉపాధిని వదులుకొని కుటుంబాలతో తిరిగి వచ్చేశారు. నేటికీ పునరావాసం కల్పించకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఉన్నఫళంగా తరలించి...
విమానాశ్రయ నిర్వాసితుల కోసం మూడు చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. పోలిపల్లి రెవెన్యూ లింగాలవలసలో రెండు చోట్ల 25 ఎకరాల్లో 256 కుటుంబాలకు, గూడెపువలస రెవెన్యూలో 17 ఎకరాల్లో 140 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. బాధితులందరికీ పరిహారంతో పాటు ప్యాకేజీలు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకుండానే తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఐదు గ్రామాలను ఖాళీ చేయించారు. అక్కడి నుంచి హఠాత్తుగా కాలనీలకు తరలించారు. ఇక్కడికి వచ్చిన నిర్వాసితుల్లో అధికశాతం కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
కాలువల్లో బండరాళ్లు
గొంతు ఎండుతున్నా...
గత మూడు నెలలుగా ఎగువవీధి కాలనీకి తాగునీరు రావడం లేదు. కాలనీలో కొందరు ఇళ్లలో వేసుకున్న బోర్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నామని నిర్వాసితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగువ వీధికి, ఎగువ వీధికి రెండు ట్యాంకులు కట్టినా ఫలితం లేదు. ఎగువవీధిలో ఉన్నది దిష్టిబొమ్మలా మారింది. అధికారులను అడిగినా సరైన సమాధానం రావడం లేదు. నిర్వాసితుల గొంతు ఎండుతున్నా వైకాపా పాలకులు పట్టించుకోవడం లేదు.
నిర్వాసిత కాలనీలో నిరుపయోగంగా ఉన్న నీటి ట్యాంకు
ప్యాకేజీ లేదు. ఇళ్లు లేవు..
- కొయ్య సూరమ్మ, నిర్వాసితురాలు
మా భూములు, గృహాలు మరడపాలెంలో ఉండేవి. జీవనోపాధికి వేరే ప్రాంతానికి వలస వెళ్లి బతకడమే తప్పయింది. ఆ రోజు మాకు ఇస్తానన్న ప్యాకేజీ ఇవ్వలేదు. రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వమని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. పాలకులూ పట్టించుకోలేదు.
మౌలిక వసతులు ఒట్టిమాటే..
- లోపున సత్యవతి, మరడపాలెం పునరావాస కాలనీ
కాలనీల్లో ఇళ్లు కట్టడమే కాకుండా మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పిన అధికారులు నేడు ఎక్కడా కనిపించడం లేదు. కాలువల్లో పడిన బండరాళ్లు అలాగే ఉన్నాయి. మురుగు నీరు పారడం లేదు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలీడం లేదు.
కుళాయి నీరు హుళక్కే..
రమణ, మరడపాలెం పునరావాస కాలనీ
ఎగువ వీధిలో ఉన్న 70 కుటుంబాలకు మూడు నెలలుగా కుళాయి నీరు రావడం లేదు. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వీధుల్లో బోరు బావులు పనిచేయడం లేదు. ప్రధాన రహదారిలో వీధిదీపాలు లేక చీకట్లు తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకపై.. డేగకన్ను
[ 19-05-2024]
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
జీర్ణావస్థలో జీసీసీ
[ 19-05-2024]
గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని ప్రభుత్వం ఖూనీ చేసింది. -
భూసార పరీక్షల ఫలితాలేవీ..?
[ 19-05-2024]
ఏ పంట పండించినా దిగుబడి బాగుండాలంటే భూమి సారవంతంగా ఉండాలి. దీని కోసం భూమిలో లోపాలు తెలుసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలి. దీంతో దిగుబడి పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. -
కూటమికి 160 పైగా సీట్లు ఖాయం
[ 19-05-2024]
రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమని చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం చీపురుపల్లిలోని నటరాజ్ రెసిడెన్సీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
ఉన్నవి 24 రోజులే.. నాడు-నేడు మాటేమిటి?
[ 19-05-2024]
రెండో విడత నాడు నేడు పనులు నిధుల కొరతతో 2023 అక్టోబరు నుంచి నిలిచిపోయాయి. ఏప్రిల్లో డబ్బులు విడుదలైనా సిమెంట్, ఇసుక వంటివి అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగలేదు. -
వైకాపా కదలికలపై నిఘా అవసరం
[ 19-05-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ గది తెరిచిన ఘటనపై శనివారం బంగ్లాలో పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. -
ఈ ఖరీఫ్లో కన్నీరే!
[ 19-05-2024]
కళ్లెదుటే నీళ్లున్నాయి.. చేతుల్లో డబ్బులున్నాయి.. కానీ ఫలితం లేదు.. పొలం తడవదు.. పంట పండదు.. జలాశయాల ఆధునికీకరణకు జైకా నిధులిచ్చినా.. పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లిప్తత చూపించింది. ఫలితంగా మూడేళ్లు అవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదు. -
అనంతపురం ఎస్పీగా గౌతమీశాలి
[ 19-05-2024]
విశాఖపట్నం 16 బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న గౌతమీశాలిని ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీగా నియమించింది. -
ఈఏపీసెట్లో మెరుపులు
[ 19-05-2024]
తెలంగాణ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లాల విద్యార్థులు మెరిశారు. వ్యవసాయం, ఫార్మసీ విభాగంలో బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నాగుదాసరి రాధాకృష్ణ రెండో ర్యాంకు, ఇంజినీరింగ్ విభాగంలో విజయనగరానికి చెందిన దనుకొండ శ్రీనిధి పదో ర్యాంకు పొందారు. -
స్ట్రాంగ్ రూం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదు
[ 19-05-2024]
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!