ఆదివారం వైద్యం అంతంత మాత్రమే
నర్సంపేట సీహెచ్సీ ఆసుపత్రిలో ఆదివారం ఒక గైనకాలజిస్టు సింధూర, డ్యూటీ వైద్యులు వంశీధర్, విక్రమ్, జీడీఎం వైద్యురాలు స్నేహ మొత్తం నలుగురు విధుల్లో ఉన్నారు. వంశీధర్, విక్రమ్ ఓపి చూడగా మహిళలను, ప్రసూతీ వార్డులో రోగులను గైనకాలజిస్టు సింధూర పరీక్షించి వైద్యం అందించారు. 130 మందికి ఓపీలో వైద్యం అందించారు. ఐపీలో 49 మంది రోగులున్నారు. సెలవు రోజు కూడా రోగులకు భేష్ అయిన వైద్య సేవలందించారు.
నర్సంపేట సీహెచ్సీలో రోగులకు వైద్య సేవలందిస్తున్న సిబ్బంది
అందరూ విధులకు హాజరయ్యారు..
నర్సంపేట: నర్సంపేట సీహెచ్సీ ఆసుపత్రిలో ఆదివారం ఒక గైనకాలజిస్టు సింధూర, డ్యూటీ వైద్యులు వంశీధర్, విక్రమ్, జీడీఎం వైద్యురాలు స్నేహ మొత్తం నలుగురు విధుల్లో ఉన్నారు. వంశీధర్, విక్రమ్ ఓపి చూడగా మహిళలను, ప్రసూతీ వార్డులో రోగులను గైనకాలజిస్టు సింధూర పరీక్షించి వైద్యం అందించారు. 130 మందికి ఓపీలో వైద్యం అందించారు. ఐపీలో 49 మంది రోగులున్నారు. సెలవు రోజు కూడా రోగులకు భేష్ అయిన వైద్య సేవలందించారు.
పేరుకే 24 గంటల ఆసుపత్రి: నల్లబెల్లి : మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరుకే 24 గంటల ఆసుపత్రిగా కొనసాగుతోంది. సిబ్బంది కొరత కారణంగా రోజంతా వైద్య సేవలు అందడం లేదు. ఆదివారం ‘న్యూస్టుడే’ పరిశీలించగా రుద్రగూడెం రెండో ఏఎన్ఎం అనిత రోగులను పరీక్షించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గం.ల వరకే వైద్య సేవలందించారు. 28 మందిని పరీక్షించి మందులు అందజేశారు. డయేరియా కారణంగా ముగ్గురికి గ్లుకోజ్ బాటిల్స్ అందించారు.
ఓపీ సేవల్లో ఒక్కరే: దుగ్గొండి: నిరంతర సేవలందించే ఈ ఆసుపత్రిలో ఏఎన్ఎం రోజమ్మ ఒక్కరే విధుల్లో ఉన్నారు. అప్పటికే నలుగురు రోగులకు ఓపీ సేవలందించినట్లు రిజిస్టరులో నమోదు చేశారు. ఆదివారం వైద్యులు ఏ ఒక్కరూ విధులకు హాజరు కాలేదు. ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఇన్ఛార్జి వైద్యాధికారి. మరొక వైద్యురాలిని ఇటీవల కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. ప్రతి ఆదివారం ఒక్కో ఉపకేంద్రం ఏఎన్ఎంకు అదనపు బాధ్యతలు అప్పగించి ఓపీ సేవలు అందిస్తున్నారు.
ఆదివారం వైద్య సేవలు ఇలా ఉండాలి
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: జిల్లా ఆసుపత్రులుగా ఉన్న వరంగల్ ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ఆయుర్వేద ఆసుపత్రుల్లో ఆదివారం ఓపీ వైద్య సేవలు ఉండవు, అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఎంజీఎంలో ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, ఆర్థో., సర్జరీ, పీడియాట్రిక్ వైద్యులు 24 గంటలూ విధుల్లో ఉండాలి. ఆదివారం రోజు తప్పనిసరిగా పై విభాగాల వైద్యాధికారులు ఉదయం 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 9గంటల వరకు విధుల్లో ఉండాలి. వీరితోపాటు న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఈఎన్టీ, కార్డియాలజీ, మెడికల్ అంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ సూపర్స్పెషాలిటీ వైద్యవిభాగాల వైద్యులు అత్యవసర రోగులకు సేవలందించాలి. వీరందరూ ఆన్కాల్పై సేవలందించేలా ఎప్పటినుంచే వ్యవస్థ ఉంది.
ప్రసూతి ఆసుపత్రులలో: ఆదివారం ఓపీ వైద్యసేవలు ఉండవు,. మిగిలిన అత్యవసర సేవలు అనగా ప్రసవాలు, ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన రిఫరల్ కేసులు, క్రిటికల్గా ఉన్న వారికి అత్యవసర శస్త్రచికిత్సలు అందించడానికి డ్యూటీ మెడికల్ అధికారితోపాటు వైద్యులు అందుబాటులో ఉండాలి.
సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో: డ్యూటీ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. తమ వద్దకు వచ్చిన కేసుల్లో క్రిటికల్గా ఉన్న వారిని జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేయాలి. సాధారణ, ప్రసూతి సేవలు అందించాలి.
పీహెచ్సీల్లో: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆదివారం ఉదయం 12 గంటల వరకు ఓపీీ సేవలు అందించాలి. సాయంత్రం 4 గంటల వరకు వైద్యుడు, సిబ్బంది అందుబాటులో ఉంటూ, గర్భిణులకు సేవలు, సాధారణ వైద్యసేవలను అందించాలి.
ఎంజీఎం క్యాజువాలిటీలో అత్యవసర రోగులకు సేవలందిస్తున్న వైద్యులు
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం వైద్యులందరూ అందుబాటులో ఉన్నారు. ఆదివారం ఓపీీ సేవలు ఉండనందున అత్యవసర వైద్యసేవలకు వైద్యులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. క్యాజువాలిటీ అత్యవసర విభాగంలో సీీఎంవో డాక్టర్ వరుణ్, డీఎస్వో డాక్టర్ శివశంకర్, డాక్టర్ శ్వేత అందుబాటులో ఉన్నారు. వీరితోపాటు ఆర్థో, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, సర్జరీ వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆదివారం ఉదయం హంటర్రోడ్డు ప్లైఓవర్బ్రిడ్జి పై నుంచి కారుపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని ఎంజీఎంకు క్యాజువాలిటీకి తీసుకొచ్చినప్పుడు వైద్యులు తక్షణం స్పందించి వైద్యసేవలందించారు. అందులో ఒకరు క్యాజువాలిటీలో సేవలందిస్తుండగా మృతిచెందారు. మరొకరు డ్రైవర్ షేక్ఖాసీీం వలీ పరిస్తితి విషమంగా ఉండగా చికిత్స అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 300మంది అత్యవసర రోగులకు సేవలందించారు. ఇక ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయు వార్డులను ఆయా వైద్యవిభాగాల ప్రొఫెసర్, అసిస్టెంటు ఫ్రొఫెసర్లు సందర్శించి రోగుల పరిస్థితిపై ఆరాదీసి చికిత్సకు సూచనలు చేసి వెళ్లారు. అత్యవసర రోగులకు మైనర్ శస్త్రచికిత్సలు చేశారు.
* వరంగల్ సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో ఆదివారం ఓపీసేవలు లేవు. ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు, ఒక డ్యూటీ మెడికల్ ఆపీఫసర్, ఇద్దరు అనస్థిషియా వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఉదయం ఒక అత్యవసర ప్రసూతి చేశారు. నెలలు నిండక న్యూబర్న్ వార్డులో ఉన్న పిల్లలకు వైద్యసేవలను అందించారు.
సిబ్బంది వైద్యమే దిక్కు
వర్ధన్నపేటలోని సీహెచ్సీలో ఖాళీగా ఉన్న వైద్యాధికారి గది
వర్ధన్నపేట రూరల్, న్యూస్టుడే: వర్ధన్నపేట సీహెచ్సీలో ఆదివారం వైద్యులు అందుబాటులో లేరు. ఇద్దరు జీఎన్ఎంలు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఉదయం వైద్యులు వచ్చి ప్రసవాలు చేసి వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. కార్యాలయంలో గదులు ఖాళీగా దర్శనమిచ్చాయి. పిల్లల వైద్యుడు విధుల్లో లేరు. కుక్కకాటుకు గురైన దమ్మన్నపేటకు చెందిన ఓ యువకుడు ఆసుపత్రికి రాగా వైద్యుడు లేకపోవడంతో జీఎన్ఎం సూది మందు వేశారు. కింది స్థాయి వైద్య సిబ్బందే సేవలందిస్తున్నారని రోగులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.