త్వరలో పెండింగ్ బిల్లుల చెల్లింపు
ప్రభుత్వ ప్రాధాన్య, ప్రతిష్ఠాత్మక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పంచాయతీ విభాగం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి సమాయత్తమవుతోందని జనగామ డీపీవో కండ్లకుంట రంగాచారి పేర్కొన్నారు. పల్లెలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు
జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి
జనగామ, న్యూస్టుడే: ప్రభుత్వ ప్రాధాన్య, ప్రతిష్ఠాత్మక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పంచాయతీ విభాగం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి సమాయత్తమవుతోందని జనగామ డీపీవో కండ్లకుంట రంగాచారి పేర్కొన్నారు. పల్లెలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమంలో వివిధ అంశాలపై ఆయనతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన ఏమంటున్నారంటే..
గత పల్లె ప్రగతిలో సాధించిన ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి.
పారిశుద్ధ్యం, మొక్కల పెంపకంలో చెప్పదగిన అభివృద్ధి కనిపిస్తోంది. ఈ రెండు అంశాలలో ప్రగతి సాధించేందుకు ట్రాక్టర్లు, ట్యాంకర్ల పాత్ర ప్రముఖంగా ఉంది. ఉపాధి హామీ నిధులతో మొక్కలు, వృక్షాల సంరక్షణకు అవకాశం ఏర్పడింది.
పన్నుల వసూళ్లు ఎలా ఉన్నాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం జిల్లాలో వంద శాతం పన్నుల వసూలు జరిగింది. సుమారు రూ.6.5 కోట్లు వసూలయ్యాయి. అసెస్మెంటు కాని ఇళ్లను గుర్తించి పన్ను మదింపు చేయాలని ఆదేశించాం.
జనాభా తక్కువ ఉన్న చిన్న పంచాయతీలకు నిధుల కొరత అంశం వేధిస్తోంది. కదా.
ఉపాధి హామీ పథకం నిధులను వివిధ పనులకు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. పంచాయతీ పరిధిలోని వనరులను ఆదాయ మార్గంగా మార్చుకుంటే కొంత భారం తప్పుతుంది.
అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల సంగతేంటి? టీఎస్ బీపాస్ అమలుకు చర్యలు చేపట్టారా.
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించవద్దని ఆదేశాలున్నాయి. క్రమబద్ధీకరణ అంశం పరిధిలో లేని అక్రమ లే ఔట్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. టీఎస్బీపాస్ అమలుకు మార్గదర్శకాలు రాలేదు.
జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు ఏం ఏర్పాట్లు జరిగాయి.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి. నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఎన్నికలు జరగాల్సిన చోట వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రకటించాం. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. రాజకీయ పార్టీలతో మండల, జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించడం పూర్తయ్యింది.
ఉప ఎన్నికలు జరిగే చోట ఓటర్ల నమోదుకు అవకాశాలున్నాయా.
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ. ఎన్నికలు జరిగే జీపీల పరిధిలోనూ ఎన్నికల ప్రకటన వెలువడే వరకు జరుగుతుంది. ఇది సంబంధిత ఈఆర్వో పరిధిలో చేసుకోవాల్సి ఉంటుంది.
న్యూస్టుడే : పల్లెప్రగతి కార్యక్రమంలో ఈ దఫా ప్రధాన అంశం ఏమిటి?
డీపీవో: గ్రామాలను తీర్చిదిద్దేందుకు జూన్ 3న పల్లె ప్రగతి కార్యక్రమం జరపాలని ప్రభుత్వం నిర్దేశించింది. హరితహారం, సమగ్ర పారిశుధ్య విధానం అమలు తదితర అంశాలతోపాటు, ఈ దఫా క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ముఖ్య అంశంగా ఉండనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.
గ్రామాల్లో నిధుల కొరత ఉందని, గతంలో చేసిన పనులకే బిల్లులు రాలేదనే విమర్శలున్నాయి. కదా ఎలా ముందుకెళ్తారు.
పంచాయతీలకు నెల వారీగా అందాల్సిన నిధులు మంజూరవుతున్నాయి. ట్రెజరీలో ఆయా జీపీలకు సంబంధించి నిధులున్నా, మంజూరు కావడంలేదనే విషయం గురించి ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే పెండింగు బిల్లులు క్లియర్ అవుతాయి. ఈ కార్యక్రమానికి నిధుల అంశం ఆటంకం కాబోదు.
జిల్లాలో కార్యదర్శులు తక్కువ మంది ఉన్నారని ఆరోపణలున్నాయి. ఏమంటారు.
అదేం లేదు. అవసరమైన చోట ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు జరిగాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో కొందరు సెలవుపై వెళ్లారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.
ఎల్ఈడీల అంశం ఎందాకా వచ్చింది.
50 జీపీలకు పైన ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి. ఈఈఎస్ఎల్ ఆధ్వర్యంలో వీధి దీపాల నిర్వహణపై సర్పంచులకు అనుమానాలు, సందేహాలున్నాయి. నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏర్పడిన ఖాళీలను పూరిస్తారా.
ఇటీవల జనగామ మండలం శామీర్పేట సర్పంచి మృతి చెందారు. సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపించాం. కానీ ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ప్రక్రియ అంతా నిబంధనలు, గడువు మేరకు జరపాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.