ఆరోగ్యమస్తు..!
జిల్లా వాసులకు ఇక నుంచి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందనున్నాయి. జిల్లా (100 పడకల) ఆసుపత్రిలో దసరా నుంచి సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకు సాధారణ ఓపీ, ఇన్పేషెంట్లకు మాత్రమే వైద్య సదుపాయాలు ఉండేవి. పండగ రోజున ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ పడకలను ప్రారంభించనున్నారు.
జిల్లా ఆసుపత్రిలో దసరా నుంచి మరిన్ని సేవలు
జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లా వాసులకు ఇక నుంచి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందనున్నాయి. జిల్లా (100 పడకల) ఆసుపత్రిలో దసరా నుంచి సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకు సాధారణ ఓపీ, ఇన్పేషెంట్లకు మాత్రమే వైద్య సదుపాయాలు ఉండేవి. పండగ రోజున ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ పడకలను ప్రారంభించనున్నారు. దీంతో పలు చికిత్సల కోసం వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పనుంది.
ఆరోగ్యశ్రీ...
ఆసుపత్రిలో నెల రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎముకలు విరిగితే పీఓపీ, ఇతర వైద్య సేవలు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా అందేవి. ఇక నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కూడా పెరగనున్నాయి. ఎన్సీడీ క్లినిక్ను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. అలాగే వైద్య కళాశాల నిమిత్తం ఆసుపత్రి పైన మరో అంతస్తు నిర్మించనున్నారు.
నూతన ఐసీయూ
3 ఆపరేషన్ థియేటర్లు, 10 ఐసీయూ పడకలు..
జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిలో ప్రస్తుతం మాతాశిశు కేంద్రంతో పాటు సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. సౌకర్యాలున్నా వైద్యులు లేక శస్త్రచికిత్సలు, ఇతర సేవలు అందేవి కావు. ఇటీవల నూతనంగా ప్రత్యేక వైద్యనిపుణులను నియమించడంతో ఆధునిక ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేస్తున్నారు. సాధారణ, ఆర్థో, ఇన్ఫెక్టెడ్ శస్త్రచికిత్సల వైద్యసేవల నిమిత్తం వీటిని వినియోగించనున్నారు. వీటితో పాటు ఇతర చికిత్సల కోసం కూడా ఇవి సిద్ధంగా ఉంటాయి..
* 10 ఐసీయూ పడకలను దసరా రోజు ప్రారంభించనున్నారు. అత్యవసర, మెరుగైన వైద్యం అందాలంటే తప్పకుండా ఆక్సిజన్, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ అవసరం. కొవిడ్ సమయంలో ఓ ఎన్ఆర్ఐ ఐసీయూ కేంద్రానికి అవసరయమ్యే పరికరాలను అందించారు. దీంతో వాటిని సిద్ధం చేసి వినియోగించనున్నారు.
పెరిగిన ఓపీ
నూతన వైద్యులు రావడంతో ఓపీ పెరిగింది. ఇది వరకు 20 మంది లోపే వచ్చేవారు. ప్రస్తుతం రోజూ 150 మందికి పైగా రోగులు వస్తున్నారు. అలాగే 50 మంది వరకు ఆసుపత్రిలో చేరుతున్నారు. జులై నెలలో 6 శాతం ఉన్న ఓపీ ఇప్పుడు 40 శాతానికి పెరిగింది. వచ్చే రెండు నెలల్లో మరింత పెంచుతామని వైద్యులు చెబుతున్నారు.
23 మంది స్పెషలిస్టు వైద్యులు..
ఇప్పటికే నలుగురు వైద్య నిపుణులున్నారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో పీజీ వైద్యవిద్య పూర్తి చేసుకున్న 23 మంది ఎస్ఆర్ (సీనియర్ రెడిసెంట్) వైద్యులను నియమించారు. నలుగురు జనరల్ మెడిసిన్, ఇద్దరు చొప్పున జనరల్ సర్జన్లు, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఒకరు పల్మనాలజిస్టు, ఒకరు చర్మవ్యాధి నిపుణులు, మిగతా ఇతర వైద్యనిపుణులున్నారు. వీరు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ చూస్తున్నారు. తర్వాత ఆసుపత్రిలో చేరిన రోగులకు చికిత్సలు, అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటున్నారు.
జిల్లా వాసులకు మెరుగైన వైద్యం..
డాక్టర్ సంజీవయ్య, డీసీహెచ్ఎస్, భూపాలపల్లి
కలెక్టర్ భవేశ్మిశ్రా, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలు జిల్లా ఆసుపత్రికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఓపీ పెరిగింది. వివిధ రకాల శస్త్ర చికిత్సలు ఈ ఆసుపత్రిలోనే చేస్తారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
మరింత కృషి చేస్తా..œండ్ర వెంకట
వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్యే భూపాలపల్లి
వంద పడకల ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందనున్నాయి. శస్త్రచికిత్సల విభాగం అందుబాటులోకి రానుండటం సంతోషం. సీఎం కేసీఆర్ అడగగానే జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశారు. త్వరలోనే అందుబాటులోకి రానుంది. మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.