logo

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ రాణించాలి

భూపాలపల్లిలోని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొని పూజలు చేశారు. 

Published : 05 Oct 2022 02:17 IST


చండీయాగంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ తదితరులు

భూపాలపల్లి టౌన్‌, న్యూస్‌టుడే: భూపాలపల్లిలోని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొని పూజలు చేశారు.  తొమ్మిదో రోజున అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు, జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రమేష్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వెంకటరాణి, వైస్‌ ఛైర్మన్‌ హరిబాబు, ఎంపీపీ లావణ్య, తెరాస పట్టణ అధ్యక్షుడు జనార్దన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని