కుక్క కాటు.. ఎంజీఎంకు పరుగు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబిస్ కుక్కకాటు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆరోగ్య కేంద్రాల్లో టీకా ఉన్నా వైద్యులు రాక ఇబ్బందులు
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబిస్ కుక్కకాటు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయినా బాధితులు దూరభారం లెక్క చేయకుండా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండక ఇంతదూరం రావాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు వైద్యుడు పరీక్షించి సూచించకుండా టీకా ఇవ్వలేమని సిబ్బంది అంటున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. దీంతో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండే ఎంజీఎంకు బాధితులు వస్తున్నారు.
ఎంజీఎం ఆసుపత్రిలోని కుక్కకాటు ఇంజక్షన్ ఇచ్చు గది వద్ద బాధితులు
* రెండురోజుల కిందట కాశీబుగ్గ పోచమ్మగుడి వద్ద ఇంటిముందు ఆడుకుంటున్న రోహిత్(7) అనే బాలుడిని కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. వారికి దగ్గరలోనే కాశీబుగ్గలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఉంది. అక్కడకు వెళ్లి బాలుడికి టీకా ఇప్పించకుండా ఎంజీఎంకు తీసుకొచ్చారు. కారణాలు అడిగితే టీకా ఉంది కానీ వైద్యుడు లేడు.. అందుకే ఎంజీఎంకు వచ్చామని బాధితులు తెలిపారు.
* జనగామ జిల్లా చాగల్లుకు చెందిన బాలుడిని కుక్కలు గాయపర్చగా ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఇంత దూరం ఎందుకు వచ్చారు అక్కడే ఆసుపత్రి ఉందిగా అంటే... వైద్యులు లేరని సమాధానమిచ్చారు.
ఆరోగ్య కేంద్రాల్లో నిల్వలు
ఉమ్మడి వరంగల్జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో యాంటి రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వరంగల్ కేంద్ర ఔషధ గిడ్డంగి నుంచి అన్ని ప్రాథమిక, పట్టణ, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు గత జనవరి నుంచి ఇప్పటి వరకు 16,286 వ్యాక్సిన్లు సరఫరా చేశారు. అవసరమైన ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి 23,600 వ్యాక్సిన్లు నిల్వ ఉన్నట్లు కేంద్ర ఔషధ గిడ్డంగి ఫార్మసీ సూపర్వైజర్ ఉప్పు భాస్కర్రావు తెలిపారు.
మీకు తెలుసా..
* వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రతిరోజు కుక్కకాటు టీకా తీసుకోవడానికి 65 మందికిపైగా బాధితులు వస్తున్నారు. అంటే నెలకు 2 వేలకు పైగానే ఉంటారు.
* కుక్కకాటుకు గురైన వారిని వైద్యులు పరీక్షించి కరిచిన కుక్కరకం, శరీరానికి అయిన గాట్లు, గాయాన్ని బట్టి రేబిస్ వ్యాధి రాకుండా టీకా కోర్సు రాస్తారు. ఇందులో 3-7-14-28-90 రోజుల కోర్సు వాడాల్సి ఉంటుంది.
పల్లెల్లో కోతుల బెడద సైతం..
బోనులో బంధించిన కోతులు
నర్సంపేట, న్యూస్టుడే: పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోజూ ఏదో ఓ గ్రామంలో వాటి దాడిలో గాయ పడుతున్న సంఘటనలున్నాయి. నిరుడు ద్వారకపేటలో పిచ్చికుక్క జరిపిన దాడిలో 15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. గత ఫిబ్రవరిలో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో కుక్కలు దాడి చేయగా తొమ్మిది గొర్రెలు మృతి చెందగా నాలుగు గొర్రెలకు గాయాలయ్యాయి. నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి నెలలో కుక్కలు చేసిన దాడిలో గాయపడిన 125 మందికి, కోతుల దాడిలో గాయపడిన 10 మందికి ఆంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం సర్కార్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 125 ఆంటీ రేబీస్ వాయిల్స్ అందుబాటులో ఉన్నట్లు ఫార్మాసిస్టు మాధవి తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
డాక్టర్ ఎ.రాజేంద్రప్రసాద్, సీనియర్ ఫిజిషియన్
కుక్కకాటు అయిన చోట ఎంతగాయమైన కుట్లు వేయరు. కాబట్టి గాయమైన చోట నీటితడి తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. గాయమైన చోట రోజూ యాంటీ సెప్టిక్ లోషన్తో శుభ్రం చేసుకోవాలి. గాయమైన దగ్గర చీము పట్టకుండా వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్ మాత్రలు వాడాలి.
కొరత లేదు
డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్వో, హనుమకొండ
కుక్కకాటు, కోతి కాటు, పాము, తేలు కాటుకు సంబంధించిన టీకాను జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. ఎక్కడా కొరత సమస్యలేదు. పెద్దగాయాలైన వారిని మాత్రమే ఎంజీఎంకు పంపిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.