నిబంధనలు మరిచారు.. అంధకారం నింపారు
‘పట్టణ ప్రగతి నిధులతో అత్యవసరమైనవి, దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులుగా ఎంపిక చేసి చేపట్టాలి. పాత విద్యుత్తు స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం, నివాస గృహాలు, కాలనీల్లో వేలాడే కరెంటు వైర్ల తొలగింపు పనులు అత్యవసరంగా చేపట్టాలి.
న్యూస్టుడే, కార్పొరేషన్
వరంగల్ పాపయ్యపేట పెద్ద మోరి వద్ద పాత విద్యుత్తు స్తంభాలు
‘పట్టణ ప్రగతి నిధులతో అత్యవసరమైనవి, దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులుగా ఎంపిక చేసి చేపట్టాలి. పాత విద్యుత్తు స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం, నివాస గృహాలు, కాలనీల్లో వేలాడే కరెంటు వైర్ల తొలగింపు పనులు అత్యవసరంగా చేపట్టాలి. ఈ నిబంధనలు పాటించని బల్దియా అధికారులు, పాలకవర్గం నగరాన్ని చీకటిలో మగ్గేలా చేశారు. చిన్నపాటి గాలులకే విద్యుత్తు సరఫరా నిలిచిపోయి దాదాపు 12 గంటలకు పైగా పౌరులు ఇబ్బందిపడ్డారు.
నగర పాలక సంస్థ పట్టణ ప్రగతి నిధులను అత్యవసర పనులకు కేటాయించడం లేదు. కార్పొరేటర్లు, గుత్తేదారులు అడిగిన పనులకే నిధులు కేటాయిస్తున్నారు. తొలి ప్రాధాన్యంగా పాత విద్యుత్తు స్తంభాల తొలగించి కొత్తవి బిగించడం, కొత్త వైర్లు ఏర్పాటుచేయడం చేయాలి. టీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలి. నగరంలో వీటిని విస్మరించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి ఇతర పనులే ప్రతిపాదిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 25- 30 ఏళ్ల క్రితం నాటి ఇనుప విద్యుత్తు స్తంభాలు తుప్పుపట్టాయి. వాటిని తొలగించక పోవడంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసినప్పుడు కూలుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వడగళ్లవానకు విద్యుత్తు వ్యవస్థ అంతా దెబ్బతింది. ఇందుకు కారణం తీగలు సక్రమంగా లేకపోవడం, విద్యుత్తు స్తంభాలు నేల వాలడమే. ఫలితంగా శనివారం రాత్రి నుంచి నిలిచిపోయిన విద్యుత్తు సరఫరాను ఆదివారం మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరించారు.
మూడు వేల స్తంభాలు అవసరం
* ‘నగరంలోని 66 డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అత్యవసరంగా చేయాల్సిన 2550 పనులు గుర్తించారు.
* పాతవి తొలగించడం, కొత్త కాలనీల్లో ఏర్పాటు చేసేందుకు సుమారు 3 వేల విద్యుత్ స్తంభాలు అవసరముంటాయని తేల్చారు. ఏడెనిమిది నెలలవుతున్నా ఒక్క స్తంభం కొనుగోలు చేయలేదు.
* విలీన గ్రామాలు, కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో 34 కాలనీల్లో వేలాడే విద్యుత్ వైర్లు తొలగించాలని గుర్తించారు. వీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని స్థానికులు భయపడుతున్నారు.
శాఖల మధ్య సమన్వయం లేకనే
* నగరంలోని 66 డివిజన్లలో కొత్తగా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసేందుకు గ్రేటర్ వరంగల్, టీఎన్పీడీసీˆఎల్ శాఖల మధ్య సమన్వయం లేదనే విమర్శలున్నాయి. పాతవి తరలింపు, కొత్తవి ఏర్పాటు చేసే స్తంభాలకు టీఎన్పీడీసీˆఎల్ ఇంజినీర్లు ప్రతిపాదనలు ఇవ్వాలి. గ్రేటర్ వరంగల్ ఇంజినీర్లు వాటిని పరిశీలించి తగిన నిధులు విడుదల చేయాలి. రెండు శాఖల నిర్లక్ష్యంతో రెండు రోజుల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. రామన్నపేట గంగపుత్ర వీధి, రఘునాథ్ కాలనీల్లో వేలాడే కరెంటు తీగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పునరుద్ధరణ కాని విద్యుత్తు సరఫరా
శివనగర్ శ్రీశివవిఘ్నేశ్వర ఆలయం ముందు మరమ్మతులు చేపట్టని విద్యుత్తు స్తంభం
శివనగర్, న్యూస్టుడే: 35వ డివిజన్ శ్రీశివ విఘ్నేశ్వరాలయం ముందు రెండు రోజుల క్రితం వడగండ్ల వాన, గాలులకు పడిపోయిన విద్యుత్తు స్తంభాన్ని సోమవారం రాత్రివరకు కూడా విద్యుత్తు అధికారులు పునరుద్ధరించలేదు. దీంతో మూడురోజులగా ఆ ప్రాంత వాసులు విద్యుత్తు లేక తల్లడిల్లుతున్నారు. ఈనెల 19న తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఆలయం ముందు విరిగిపోయిన స్తంభాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తిచేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించినా అధికారులు కన్నెత్తి చూడలేదు. అధికారులు తక్షణమే విద్యుత్తు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.