ఉద్యమాల గడ్డ.. నర్సంపేట
అడవులు.. ఆదివాసీ గూడేలు.. గిరిజన తండాలు.. మైదాన ప్రాంతాల కలబోతగా అవతరించిన నర్సంపేట నియోజకవర్గం సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
నియోజకవర్గం ముచ్చట
నర్సంపేట, న్యూస్టుడే : అడవులు.. ఆదివాసీ గూడేలు.. గిరిజన తండాలు.. మైదాన ప్రాంతాల కలబోతగా అవతరించిన నర్సంపేట నియోజకవర్గం సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. హైదరాబాద్ స్టేట్లో పాకాల నియోజకవర్గ పరిధిలో ఉండేది. 1956లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నర్సంపేట నియోజకవర్గంగా ఏర్పడింది. 70 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రాంతం ఆది నుంచి కమ్యూనిస్టుల పోరాటాల ఖిల్లాగా ఖ్యాతి పొందింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇక్కడ 735 రోజులు నిరాటంకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకత సంతరించుకుంది. పునర్విభజనకు ముందు చెన్నారావుపేట మండలంలోని అత్యధిక గ్రామాలు, గూడూరు మండలంలోని సగం గ్రామాలు, పూర్వపు కొత్తగూడ, నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలంలో నాలుగు గ్రామాలు మినహా, ఆత్మకూరు మండలంలోని కామారం, పెంచికలపేట, ములుగు మండలంలోని పత్తిపల్లి ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. పునర్విభజన తర్వాత నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాలు ఉన్నాయి. ఒకప్పుడు హత్యా రాజకీయాలకు ఆలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గం 1994 ఎన్నికల తర్వాత రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పులు చోటుచేసుకొని అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది.
పాకాల అభయారణ్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాకాల అభయారణ్యానికి ప్రత్యేకత ఉంది. 1972లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈ అభయారణ్యం నెలకొల్పారు. వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం చిలకమ్మనగర్ నుంచి ఇటు మహబూబాబాద్, అటూ ములుగు జిల్లాల వరకు 86020 హెక్టార్లలో(861 చదరపు కి.మీ.)విస్తరించి ఉన్నట్లు అటవీశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జింకల పార్కు ఉండేది. నక్సల్స్ ప్రభావం పెరగడంతో 1995లో ఇక్కడి జింకల పార్కును హనుమకొండలోని వనవిహార్కు తరలించారు. అభయారణ్యంలో 145 రకాల పక్షులుండగా అడవి దున్నలు, దుప్పులు, జింకలు, లేళ్లు, కొండగొర్రెలు, ఎలుగుబంట్లు, హైనా వంటి వన్యప్రాణులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. పాకాల సరస్సులో మంచినీటి మొసళ్లు ఉన్నాయి. నిరుడు ఇక్కడి అడవుల్లో చిరుత, పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు.
సాయుధ పోరాటం నుంచి..
పాకాల, కొత్తగూడ, నల్లబెల్లి మండలాల్లోని అటవీ ప్రాంతం కేంద్రంగా నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరి ఉద్యమాలు జరిగాయి. భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్దఎత్తున భూ పోరాటాలు జరిపి పేదలకు వేలాది ఎకరాల భూములు పంచారు. గ్రామాల్లో వెట్టిచాకిరి, పాలేర్ల సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి పేదల బతుకుల్లో మార్పునకు నాంది పలికిన ఘన చరిత్ర ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయుల నాటి పాకాల చెరువు(సరస్సు)కింద ఏటా 25 వేలకు పైగా ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. వరంగల్ చపాట మిర్చి సాగుకు నర్సంపేట పేరుగాంచింది. నెక్కొండలోని రైల్వేస్టేషన్ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. విద్యా, వ్యాపారం, స్థిరాస్తి రంగాల్లో ప్రగతి సాధించింది. రైస్, బాయిల్డ్ రైస్ కలిపి మొత్తం 65 మిల్లులున్నాయి.
ఇప్పటివరకు ఎన్నికైన ఎమ్మెల్యేలు
సంవత్సరం విజేత సమీప ప్రత్యర్థి
1952(పాకాల) ఆరుట్ల గోపాల్రావు (పీడీఎఫ్) జమలాపురం కేశవరావు (కాంగ్రెస్)
1957 కె.కనకరత్నమ్మ (కాంగ్రెస్) అర్శనపల్లి వెంకటేశ్వర్రావు (పీడీఎఫ్)
1962 అర్శనపల్లి వెంకటేశ్వర్రావు(సీపీఐ) కాసర్ల సుదర్శన్రెడ్డి (కాంగ్రెస్)
1967 కాసర్ల సుదర్శన్రెడ్డి (కాంగ్రెస్) అర్శనపల్లి వెంకటేశ్వర్రావు(సీపీఎం)
1972 మద్దికాయల ఓంకార్ (సీపీఎం) పెండెం కట్టయ్య (కాంగ్రెస్)
1978 మద్దికాయల ఓంకార్(సీపీఎం) గంట ప్రతాప్రెడ్డి (కాంగ్రెస్)
1983 మద్దికాయల ఓంకార్ (స్వతంత్ర) పెండెం కట్టయ్య (కాంగ్రెస్)
1985 మద్దికాయల ఓంకార్ (స్వతంత్ర) ఎం.ఉపేందర్రావు (కాంగ్రెస్)
1989 మద్దికాలయ ఓంకార్ (స్వతంత్ర) ఏపూరి జనార్దన్రెడ్డి (కాంగ్రెస్)
1994 రేవూరి ప్రకాశ్రెడ్డి (తెదేపా) మద్దికాయల ఓంకార్ (ఎంసీపీఐ)
1999 రేవూరి ప్రకాశ్రెడ్డి (తెదేపా) దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్)
2004 కంభంపాటి లక్ష్మారెడ్డి (తెరాస) రేవూరి ప్రకాశ్రెడ్డి (తెదేపా)
2009 రేవూరి ప్రకాశ్రెడ్డి (తెదేపా) దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్)
2014 దొంతి మాధవరెడ్డి (స్వతంత్ర) పెద్ది సుదర్శన్రెడ్డి (తెరాస)
2018 పెద్ది సుదర్శన్రెడ్డి (తెరాస) దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమతి లేని క్లినిక్లు.. అర్హత లేకున్నా చికిత్సలు
[ 03-05-2024]
ఉమ్మడి వరంగల్లో వైద్యం వ్యాపారమైంది. నకిలీ వైద్యులు దీన్ని వ్యాపారంగా మలుచుకొని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 75 శాతం నకిలీ వైద్యులు ప్రైౖవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్లినిక్ల పేరిట చిన్నస్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. -
వసతులు కల్పిస్తేనే పండగలా పోలింగ్
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే భారత ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్కౌంటర్లో చనిపోయింది సుష్మిత కాదా..!
[ 03-05-2024]
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. వీరిలో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సూధన్పల్లికి చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు తిక్క సుష్మిత -
పాత వారికి ప్రాధాన్యం.. కొత్త వారికి గౌరవం
[ 03-05-2024]
పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పాత వారికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఇటీవల కాంగ్రెస్లో చేరిన వారిని గౌరవించుకుందామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
మోదీ నాయకత్వంలో దేశం పురోగతి
[ 03-05-2024]
మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం రాత్రి ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా కార్నర్ మీటింగ్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్తో కలిసి మాట్లాడారు. -
అమలుకు నోచని హామీలతో కాంగ్రెస్ మోసం
[ 03-05-2024]
అమలుకు నోచని హామీలతో మోసం చేసి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరూ నమ్మడం లేదని వరంగల్ లోక్సభ నియోజకవర్గ భారాస అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. -
‘భాజపావి బ్లాక్మెయిల్ రాజకీయాలు’
[ 03-05-2024]
దేశంలో మరోసారి అధికారంలోకి రావడానికి భాజపా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విమర్శించారు. -
దేశం కోసం మరోసారి మోదీ..
[ 03-05-2024]
దేశం కోసం, ధర్మం కోసం మూడోసారి మోదీని ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, 400కు పైగా పార్లమెంటు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే టి.వెంకటరమణారెడ్డి, భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ అన్నారు. -
నేటి నుంచి ‘ఇంటి వద్ద ఓటింగ్’
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు, 85 ఏళ్లపై బడిన ఓటర్లు, దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. -
ఎండలు బాబోయ్..
[ 03-05-2024]
జిల్లాలో రోజురోజుకు ఎండ దంచి కొడుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి.. జన సంచారం లేక రోడ్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
ఇంటి నుంచి ఓటుకు అర్హులు 866
[ 03-05-2024]
పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు తమ ఓటు హక్కును తాము ఉన్నచోటనే వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ వర్గాలవారికి అవకాశం కల్పించింది. -
టీ హబ్కు జబ్బు
[ 03-05-2024]
ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ‘టీ హబ్’కు జబ్బు చేసింది. సుమారు 20 రోజులుగా పరీక్షలు నిర్వహించడం లేదు. విద్యుత్తు సమస్య కారణంగా యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
అభ్యర్థులు నచ్చకపోతే.. నోటా
[ 03-05-2024]
రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటుహక్కు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు దీన్ని వినియోగిస్తారు. ఒకవేళ వారెవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)ను సంధించొచ్చు. -
ఓట్ల గని ఎవరికో?
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటోంది.. రాష్ట్రానికి వెలుగులు నింపే సింగరేణి నల్లసూరీల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి కార్మిక ఓటర్లు ప్రభావం చూపనున్నారు. -
ఇంటి నుంచి ఓటుకు స్పందన కరవు
[ 03-05-2024]
ప్రతీసారి ఎన్నికల్లో వృద్ధులు.. దివ్యాంగులు అతికష్టం మీద పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం చూస్తుంటాం. అయితే గత శాసనసభ ఎన్నికల నుంచి ఇంటివద్దే ఓటువేసేందుకు వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. -
పొదుపు సంఘాలకు సోలార్ ప్లాంట్ల నిర్వహణ
[ 03-05-2024]
ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు మరింత ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వాలు మరో అవకాశం కల్పించాయి. -
వల పన్నారు.. రూ.5 కోట్లకు ముంచారు!
[ 03-05-2024]
వరంగల్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి అడ్డదారిలో భారీగా సంపాదించాలనుకున్నాడు. మరో ఇద్దరిని కలుపుకొని స్థానికంగా ఉండే ఓ బడా పత్తి వ్యాపారికి వల వేశారు. -
సెలవులో ఉద్యోగి.. కదలని దస్త్రాలు
[ 03-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. పెద్ద భవనాల అనుమతులు పెద్ద సార్లు, చిన్నాచితక భవనాల అనుమతులు కిందిస్థాయి అధికారులు చూస్తున్నారు.