యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు.
రామన్నపేట, న్యూస్టుడే : వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. ఆలయాల స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు రెవెన్యూ, భూమి, కొలతలు, దేవాదాయ, గ్రేటర్ వరంగల్ శాఖల అధికారులు నిర్ధారించారు. సుమారు 20.81 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు లోకాయుక్త న్యాయస్థానానికి నివేదించింది. ఆక్రమణల తొలగింపునకు వచ్చేసరికి అడ్డంకులు మొదలయ్యాయి. గత ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలంటే అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి కదలాలి. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చొరవ చూపితే ఆక్రమణల తొలగింపు సాధ్యమవుతుందని దేవాదాయశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇతర ప్రభుత్వ శాఖలు సహకరించడం లేదని అన్నారు.
అక్రమాల చిట్టా ఇలా..
- హనుమకొండ పద్మాక్షి ఆలయం, హనుమకొండగుట్టల భూములు మొత్తం 72.23 ఎకరాలు ఉండాలి. వీటిలో 6.22 ఎకరాల భూమిని ఆక్రమించారు. 6 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వీటిలో ఇద్దరు, ముగ్గురు పెద్దలున్నారు. గ్రేటర్ వరంగల్ అనధికారికంగా శ్మశానవాటిక నిర్మించింది.
- హనుమకొండలో శ్రీరంగనాయక స్వామి(పెద్ద కోవెల) దేవస్థానం పేరిట 14.19 ఎకరాల భూమి ఉండగా 4.06 ఎకరాలు ఆక్రమణకు గురైంది. 28 అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పెద్దమ్మగడ్డ వద్ద వాణిజ్య వ్యాపారాలు నడుస్తున్నాయి.
- హనుమకొండలోని సిద్ధేశ్వరస్వామి ఆలయానికి 24.03 ఎకరాల భూములు ఉండగా 2.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు, ఇతర పెద్ద భవనాలున్నాయి. భవనాల నిర్మాణానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చింది. నోటీసులు ఇవ్వడం లేదు.
- హనుమకొండ వీరపిచ్చమాంబ దేవాలయం పేరిట 1.14 ఎకరాల భూమి ఉంది. లీజుల పేరుతో పెద్ద భవంతులు కట్టారు. అపార్టుమెంటు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు.
- వరంగల్లో వేణుగోపాలస్వామి ఆలయం పేరిట కొత్తవాడ కూడలిలో స్థలాలున్నాయి. సుమారు 1.10 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు దేవాదాయ శాఖాధికారులు చెబుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
రాష్ట్ర కమిషనర్ ఆగ్రహం
దేవాలయాల భూముల ఆక్రమణపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు, న్యాయస్థానాల్లో కేసుల తాజా పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వరంగల్ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ను ఆదేశించినట్లు తెలిసింది. చిన్నా చితక అక్రమ నిర్మాణాలను తొలగించి ఆలయాల పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ రోడ్ షో నేడు
[ 28-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం వరంగల్ నగరంలో బస్సు యాత్రలో పాల్గొనేందుకు సర్వం సిద్ధమైంది. -
తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు
[ 28-04-2024]
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
మీరెక్కడుంటే.. మేమక్కడుంటాం..!
[ 28-04-2024]
నామపత్రాల దాఖలు పర్వం పూర్తికావడంతో లోక్సభ ఎన్నికల జోరు పెరిగింది.. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
పోలింగ్ శాతం పెంపునకు కృషి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. -
బోర్డు తిప్పేసిన నకిలీ వైద్యుడు
[ 28-04-2024]
జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు. -
ప్రజాస్వామ్యం ఓటుతోనే సాధ్యం
[ 28-04-2024]
ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. -
‘వెంట ఉన్నవాళ్లే ఓట్లేయలేదు’
[ 28-04-2024]
ఓటర్లకు తన పట్ల వ్యతిరేకత లేదని, వెంట తిరిగిన వాళ్లే ఓట్లేయలేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. -
అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
[ 28-04-2024]
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
[ 28-04-2024]
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-04-2024]
ఎన్నికల విధుల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రనవీర్ చంద్ సూచించారు. -
సంక్షేమ పాలన చూసి కాంగ్రెస్కు ఓటేయండి
[ 28-04-2024]
కులం, మతం పేరిట కాదు, కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన చూసి ఓట్లు వేయాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పంచదార పంపిణీ చేయాల్సిందే!
[ 28-04-2024]
చౌక ధరల దుకాణాల్లో ఇక నుంచి పంచదార తప్పనిసరిగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది.