పురపాలిక స్థలాలు.. ఆక్రమణల పర్వం
పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి.
మున్సిపల్ కార్యాలయం ఎదురుగా కూల్చిన ప్రహరీ
జనగామ, న్యూస్టుడే: పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి. చివరకు కార్యాలయ ఆవరణలోని స్థలం కబ్జా అవుతున్నా పట్టించుకోని దుస్థితి ఏర్పడింది. జనగామ పట్టణంలో రహదారులు, ఫుట్పాత్లు, మున్సిపల్ లే ఔట్ స్థలాలు, గ్రీన్ బెల్టు స్థలాలు, కుంటలు, చెరువులు కావేవి ఆక్రమణకు అనర్హం అన్నట్లుంది పరిస్థితి. ఎన్నికల హడావిడిలో అధికారులు తలమునకలైన తరుణంలో ఇదే అదనుగా ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు.
నాయకుల అండ ఉందని
స్థానిక వీవర్స్కాలనీలో 1000 గజాల లే ఔట్ స్థలంలో రూ.కోటి వ్యయంతో దోబీ ఘాట్ కోసం శంకుస్థాపన చేశారు. అక్కడ దోబీఘాట్ నిర్మాణంపై వివాదం ఏర్పడగా పనులు ప్రారంభించలేదు. ఇదే అదనుగా కొందరు 1000 గజాల స్థలం మధ్యలో అనుమతి లేని నిర్మాణాలకు తెరతీశారు. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆక్రమణ దారులకు నోటీసులు అందజేశారు. కొన్నాళ్ల పాటు వెనకడుగు వేసి మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ స్థలాన్ని మున్సిపల్ ఆధీనంలోకి తీసుకోలేదు. అధికార పార్టీ నాయకుడొకరి మద్దతు పేరిట ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
- మున్సిపల్ స్థలంలో కబ్జా జరిగిందని శనివారం ‘ఈనాడు’లో ‘మున్సిపల్ కార్యాలయ ఖాళీ స్థలం కబ్జా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ స్పందించారు. ఈ విషయమై కొలతలు వేయించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కనుమరుగు: వీవర్స్కాలనీ లేఔట్ స్థలంలో ప్రైవేటు, ప్రభుత్వ నిర్మాణాలున్నాయి. టీఎన్జీవోస్ కాలనీలో మిగులు స్థలానికి ముప్పు ఉంది. గాంధీనగర్లో కమ్యునిటీ భవనం, ఖాళీ స్థలానికి రక్షణ కరవైంది. అంబేడ్కర్నగర్, సంజయ్నగర్లో గ్రీన్బెల్టు స్థలాల్లో ఆక్రమణలున్నాయి. పట్టణంలో మున్సిపల్కు 10 చోట్ల లే ఔట్ మిగులు స్థలాలున్నాయి. వీటికి రక్షణ కరవైంది.
నాగార్జున టీచర్స్కాలనీలో
ఈ కాలనీ లేఔట్ మ్యాప్ వివరాలను అనుసరించి 3569.78, 1016.48 చ.గజాల స్థలం, రెండు విభాగాలుగా ఉండాలి. ఇందులో ఓ చోట మందిరం వెలిసింది. మరి కొంత స్థలంలో ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. రూ.25 వేలకు గజం విలువ ఉన్న ఈ ప్రాంతంలో తాజాగా మిగులు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ రోడ్డు పక్కనే ఉన్న ఈ స్థలం రికార్డుల ప్రకారం మున్సిపాల్టీదే. కానీ ఓ సంస్థ స్థలం వద్ద బోర్డు నాటినా, అధికారులు లెక్కలు తేల్చలేదు.
- గణేశ్వాడ, పాత ఆంధ్రాబ్యాంకు చౌరస్తా, బంజరు దొడ్డి, ఈసేవ సమీపంలోని ఖాళీ స్థలాలు పరాధీనమయ్యాయి. ఇప్పటికే మున్సిపల్ అల్పాదాయ వర్గాల వసతి గృహాలు చేజారాయి. కార్యాలయం పక్కన రాత్రి బస ప్రతిపాదిత స్థలంలో కొంత రేడియాలజీ ల్యాబ్ నిర్మించారు.
- చంపక్హిల్స్లోని 10 ఎకరాల డంపుయార్డు స్థలానికి ఆక్రమణల బెడద ఉంది. వెనకవైపు ప్రహరీ నిర్మిస్తున్నారు. అక్రమంగా మొరం, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
- పట్టణంలో మున్సిపల్ ఆస్తులపై సమగ్ర వివరాలను సేకరించి, రక్షణకు చర్యల కోసం జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని మున్సిపల్ ఛైర్పర్సన్ జమున అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
[ 18-05-2024]
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే