logo

ఓరుగల్లులో అరూరి గెలుపు ఖాయం

వరంగల్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ గెలుపు ఖాయమైందని వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పేర్కొన్నారు.

Published : 05 May 2024 05:48 IST

కాశీబుగ్గ చౌరస్తా కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌  ఎర్రబెల్లి ప్రదీప్‌రావు,
చిత్రంలో భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌, నాయకులు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ గెలుపు ఖాయమైందని వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పేర్కొన్నారు. వరంగల్‌ కాశీబుగ్గ చౌరస్తాలో శనివారం రాత్రి భాజపా కార్నర్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రదీప్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరిస్థితులు వేరు.. మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణతో పరిస్థితులు ఇప్పుడు భాజపాకు అనుకూలంగా మారాయన్నారు. వరంగల్‌ పార్లమెంటు స్థానం నుంచి నూటికి నూరుశాతం భాజపా జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ మాట్లాడుతూ.. మోదీ మరోమారు ప్రధాని కాబోతున్నారన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర నాయకులు డాక్టర్‌ విజయచందర్‌రెడ్డి, సముద్రాల పరమేశ్వర్‌, కోమాకుల నాగరాజు, ఆడెపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖిలావరంగల్‌: దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని భాజపా రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఖిలావరంగల్‌ క్రీడా మైదానంలో వాకర్స్‌, క్రీడాకారులతో మాట్లాడారు. అనంతరం 38వ డివిజన్‌ పడమరకోటలో ఇంటింటి ప్రచారం చేశారు. నాయకులు అంకాల జనార్దన్‌, ఇనుముల అరుణ్‌, ఎల్లబోయిన చంద్రమోహన్‌, అమర్‌, నందు, రమేశ్‌, సుమన్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని