logo

ప్రధాని మోదీ సభకు ఆహ్వాన పత్రిక

ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలిరావాలంటూ మొదటిసారి ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ వినూత్న ప్రచారానికి వరంగల్‌ భాజపా నాయకులు శ్రీకారం చుట్టారు.

Updated : 06 May 2024 06:36 IST

ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలిరావాలంటూ మొదటిసారి ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ వినూత్న ప్రచారానికి వరంగల్‌ భాజపా నాయకులు శ్రీకారం చుట్టారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపురం గ్రామం లక్ష్మీపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఓరుగల్లు జనసభ పేరుగా నామకరణం చేసి కింది భాగంలో వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ ఫొటో.. పైభాగంలో తెలంగాణ రాష్ట్ర రాజముద్ర కాకతీయ కీర్తితోరణం వద్ద ప్రధాని మోదీ నమస్కరిస్తున్న చిత్రంతో 1,50,000 ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రిక అందించి మోదీ సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు.

న్యూస్‌టుడే, రంగశాయిపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని