logo

‘భాజపా, భారాసలకు ఓటేస్తే మురిగిపోతుంది’

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, భారాసలకు ప్రజలు ఓటేస్తే మురిగిపోతుందే తప్ప.. పనికిరాదని వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య అన్నారు.

Published : 06 May 2024 06:07 IST

మాట్లాడుతున్న లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య

చిల్పూర్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, భారాసలకు ప్రజలు ఓటేస్తే మురిగిపోతుందే తప్ప.. పనికిరాదని వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. మండలంలోని పల్లగుట్ట, మల్కాపూర్‌, చిల్పూర్‌, చిన్నపెండ్యాల గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింగపురం ఇందిరతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు అధికారం లేకపోవడంతో రోజురోజుకు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని.. అలాంటి వ్యక్తిని ఊరి పొలిమేరలోకి కూడా రానివ్వకూడదన్నారు. ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. రైతుల భూములు లాక్కునే భాజపా అభ్యర్థి మొన్నటికి మొన్ననే వర్ధన్నపేటలో చిత్తుగా ఓడిపోయి.. మళ్లీ ఎంపీˆగా వస్తున్నాడు.. అలాంటి వారిని నమ్మకూడదన్నారు. కార్యక్రమంలో చిల్పూర్‌గుట్ట దేవస్థాన మాజీ ఛైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఎంపీˆపీˆ సరిత, వైస్‌ ఎంపీˆపీˆ సరిత, మాజీ ఎంపీˆపీˆ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని