బస్తాకు అర కిలో.. ఎకరాకు రూ.250
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.
ధాన్యం తూకంలో రైతులకు అన్యాయం
న్యూస్టుడే, బాలసముద్రం
కోమటిపల్లి ప్రాంతం కపురతండా శివారులో ధాన్యం తూకం వేస్తున్న హమాలీలు
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం తూకంలో జరుగుతున్న మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 65వ డివిజన్ కోమటిపల్లి, కపురతండా, దేవన్నపేట, ఉనికిచెర్ల గ్రామాల్లో అదనంగా తూకం వేస్తూ రైతులను దగా చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తే ఈ విషయం తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
500 గ్రాములు అదనం
గతంలో 70 కిలోలు నింపే ధాన్యం సంచి బరువు 900 గ్రాములు ఉండేది. బస్తా బరువు మోయలేమని హమాలీలు కోరడంతో దాన్ని 40 కిలోలకు కుదించారు. 40 కిలోల ధాన్యం సంచి 540 గ్రాముల బరువు ఉంటుంది. రైతుల కల్లాల్లో 40 కిలోల ధాన్యంతో పాటు అదనంగా మరో కిలో తూకం వేస్తున్నారు. వాస్తవంగా 40 కిలోల ధాన్యంతో పాటు 540 గ్రాములు సంచి బరువుతో తూకం వేయాలి. కొనుగోలు కేంద్రాల సిబ్బంది 41 కిలోలు తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
తాలు పేరుతో అదనపు తూకం
ఈసారి భూగర్భ జలాలు అడుగంటడంతో సకాలంలో పంటలకు సాగునీరు అందలేదు. దీంతో వరి ధాన్యం కొంత మేరకు తాలు ఏర్పడింది. వరికోత యంత్రాలతో ధాన్యం కుప్పలు వేసే క్రమంలో తాలు బయటకు వెళ్లి మేలురకం వచ్చింది. కొందరు రైతులకు తాలు కలవడంతో తూర్పార పట్టి కుప్పలు పోశారు. మరికొందరు ఎండల తీవ్రత కారణంగా తూర్పార పట్టలేకపోయారు. ఇదే అదనుగా తాలు కలిసిందనే కారణంతో 1.500 గ్రాముల ధాన్యం అదనంగా తూకం వేస్తున్నారు.
20 రోజలుగా నిరీక్షణ..
గత నెల మొదటి వారం నుంచే వరి కోతలు మొదలు పెట్టారు. కోమటిపల్లి, దేవన్నపేట, ఉనికిచెర్ల, కపురతండా తదితర పుర విలీన గ్రామాల్లో నెల రోజుల నుంచి వరిధాన్యం కోసి కుప్పలు పోసి ఉంచారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది సకాలంలో ప్రణాళిక చేసుకోకపోవడంతో రైతులకు ఆలస్యంగా టోకెన్లు జారీ చేశారు. మిల్లర్ల కేటాయింపు, సంచులు అందని కారణంగా కొనుగోలు కోసం రైతులు 20 రోజులుగా నిరీక్షించారు. ఇటీవల అకాల వర్షాలు కురిస్తే ఒక్కో రైతు రూ.10 వేలు వెచ్చించి పరదాలు కొనుగోలు చేసి ధాన్యం తడవకుండా కాపాడుకున్నారు. రైతులు ఆందోళన చేస్తే ఐదు రోజుల కిందట కొనుగోళ్లు ప్రారంభించారు.
- ప్రభుత్వ నిబంధనల మేరకు 40 కిలోల 700 గ్రాముల ధాన్యం తూకం వేయాలి.. అంతకు మించి ఎక్కడైనా అధిక తూకం వేసినట్లు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా సహకార అధికారి నాగేశ్వర్రావు చెప్పారు.
దిగుబడి తగ్గింది.. నష్టం పెరిగింది
గతంలో ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా ధాన్యం దిగుబడి వచ్చేది. ప్రస్తుతం సకాలంలో నీరు అందక దిగుబడి తగ్గి 21 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే వచ్చింది. 40 కిలోల సంచులతో సరి చూస్తే 56 నుంచి 60 బస్తాలు చేతికొచ్చాయి. ఒక్కో బస్తాకు 500 గ్రాముల ధాన్యం అదనంగా తూకం వేస్తే ఎకరాకు రూ.250 మేర రైతులకు నష్టం కలుగుతుంది. తాలు పేరుతో అదనంగా కిలో తూకం వేస్తే ఎకరాకు మరో రూ.693 వరకు నష్టం వస్తుంది. ప్రస్తుతం క్వింటాలు ధాన్యం రూ.2203 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
గన్ని సంచి బరువు 540 గ్రాములు ఉంటే.. అదనంగా కిలో తూకం వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలో గన్ని సంచి సరి చూస్తే 540 గ్రాములు చూపిస్తున్న చిత్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
[ 18-05-2024]
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం