logo

కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ఉంటే మరింత ప్రగతి

కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి, కంచనపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో సోమవారం కార్నర్‌ సభ నిర్వహించారు.

Published : 07 May 2024 07:03 IST

కంచనపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి, న్యూస్‌టుడే: కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి, కంచనపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో సోమవారం కార్నర్‌ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌కు నేను ఎమ్మెల్యేగా ఉన్నా.. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం. ఇక కావ్యను ఎంపీగా గెలిపిస్తే వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అందులో ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్‌లోకి వచ్చాను. పార్టీ మార్పుపై ఎవరి ఆరోపణలను పట్టించుకోను. నేను ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి సింగపురం ఇందిరే.. ఆమె అభిప్రాయాలు తీసుకోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోను’ అని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింగపురం ఇందిర, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్‌ చందర్‌రెడ్డి, ఎంపీపీ మేకల వరలక్ష్మీ, జడ్పీటీసీ బొల్లం మణికంఠ, మాజీ సభ్యుడు మారుజోడు రాంబాబు, మండలాధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని