logo

‘కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి’

భారాస పదేళ్ల పాలనలో ఎన్నో పదవులు అనుభవించి, స్వలాభం కోసం పార్టీ మారి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు.

Published : 09 May 2024 02:06 IST

ప్రసంగిస్తున్న మాజీ మంత్రి దయాకర్‌రావు, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: భారాస పదేళ్ల పాలనలో ఎన్నో పదవులు అనుభవించి, స్వలాభం కోసం పార్టీ మారి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాలను, ధర్మాపురంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో దయాకర్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన అబద్దపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, మళ్లీ అలా జరగకుండా భారాసకు ఓటేయాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని, సంవత్సరం లోపు మళ్లీ ఎన్నికలు వస్తాయన్నారు. రాజకీయాల్లో ఏడుసార్లు విజయం సాధించిన తనపై విమర్శలు చేస్తున్న కడియంకి సిగ్గుండాలని దుయ్యబట్టారు. వరంగల్‌ భారాస అభ్యర్థి డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తీగల దయాకర్‌, ప్రధాన కార్యదర్శి చింత రవి, ఎంపీపీ సావిత్రి, వైస్‌ ఎంపీపీ విజయ్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని