తపాలా ఓటు వేయనిస్తారా.. లేదా?
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తపాలా బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
అంగన్వాడీ సిబ్బందికి ఫారం-12 ఇవ్వకుండానే ముగిసిన గడువు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తపాలా బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకు ఫారం-12 సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు ఇప్పటికే ముగియడంతో తపాలా బ్యాలెట్ వినియోగానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. ఎన్నికల విధులకు నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఒప్పంద ఉద్యోగులకు తపాలా బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం లేకుండా చేశారు.
ఎన్నికల విధులను తొలుత కొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రమే కేటాయించారు. సిబ్బంది కొరత ఏర్పడటంతో అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఒప్పంద ఉద్యోగులనూ నియమించారు. తపాలా బ్యాలెట్కు దరఖాస్తు గడువుకు మూడురోజుల ముందే వీరికి విధులు కేటాయించారు. ఫారం-12 దరఖాస్తులు వీరికి ఇవ్వలేదు. ఈలోగా తపాలా బ్యాలెట్కు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఓటు హక్కు వినియోగానికి దూరం అవుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు అనేక మంది ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నందున వారి ఓట్లకు గండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఇటువంటి విధానాలకు పాల్పడుతున్నారనే విమర్శ వినిపిస్తోంది.
ఓటు వినియోగించుకునే రోజుల్లోనే శిక్షణ
ఎన్నికల విధులకు నియమితులైన ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే రోజుల్లోనే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పీవోలకు ఈ నెల 4న, ఏపీవోలకు 5న తరగతులు ఏర్పాటుచేశారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. అందుకే తపాలా బ్యాలెట్ వినియోగానికి గడువు తేదీని పెంచాలని వారు కోరుతున్నారు. ‘ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు ఫారం-12 దరఖాస్తు చేసినా చాలామందికి ఓటు వినియోగించుకునే పరిస్థితులు ఉండటం లేదు. అందుకే దరఖాస్తు చేసుకోని ఉద్యోగులకు కూడా ఫెసిలిటేషన్ కేంద్రంలో వినియోగించుకునే అవకాశం కల్పించాలి’ అని ఏపీ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్