పథకాల ఊకదంపుడే.. ప్రగతి ఊసేలేదు
ఇరవై నిమిషాల ప్రసంగంలో జిల్లా ప్రగతి గురించి.. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిపై..ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
జిల్లా సమస్యలపై నోరు విప్పని సీఎం
జగన్ వస్తేనే పథకాలుంటాయని పరోక్ష బెదిరింపులు
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే, నరసాపురం: ఇరవై నిమిషాల ప్రసంగంలో జిల్లా ప్రగతి గురించి.. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిపై..ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నియోజకవర్గ ప్రజలకు ఒక్క భరోసా ఇవ్వలేదు. ప్రసంగం చివరి వరకు పథకాలపై బాకాలూదటంతోనే సరిపెట్టారు. శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రసంగం పేలవంగా సాగింది. ఉదయం 8 గంటల నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ప్రజలను నిలబెట్టి 20 నిమిషాల్లో అంతా ముగించి ముసిముసినవ్వులు నవ్వుతూ వెళ్లిపోయారు. అసలు సంక్షేమ పథకాలను ఆయనే ప్రవేశపెట్టినట్లు మళ్లీ గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయి.. లేదంటే ఆగిపోతాయని జనాలను పరోక్షంగా బెదిరించారు.
పర్యటనతో ఒరిగిందేమిటి: ‘జగన్ పర్యటనతో జిల్లాకు..నరసాపురం నియోజకవర్గానికి ఒరిగిందేంటి’.. ఇదే సభ అనంతరం జిల్లా ప్రజలు వైకాపా నాయకులకు వేస్తున్న ప్రశ్న.వారు సమాధానం చెప్పుకోలేని విధంగా జగన్ సభ సాగింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో పరిపాలన భవనాల మొదలు సచివాలయ భవనాల వరకు అన్నింటా ఇబ్బందులున్నాయి. వాటి గురించి జగన్ కనీసం ప్రస్తావించలేదు. 2022 నవంబరులో నరసాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇటీవల భీమవరం సభకొచ్చినప్పుడు కూడా చెప్పుకొచ్చారు. ఆక్వా విశ్వవిద్యాలయం, ఫిషింగ్ హార్బర్, వశిష్ఠ వారధి, విద్యుత్తు ఉపకేంద్రం, పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ.. ఇలా ఏ ఒక్క పనీ పురోగతిలో లేదు. అయినా వాటి నిర్మాణంపై కనీసం నోరు విప్పలేదు. వైకాపా అసమర్థతతో నిలిచిన వైద్యకళాశాల పనులపై పెదవి విప్పలేదు. వైకాపా నాయకుల అక్రమాలతో ఇప్పటికే నాలుగు సార్లు జారిన నరసాపురం ఏటిగట్టుతో ప్రమాదపు ఒడిలో ఉన్న ప్రజలకు కనీస భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చినుకు పడితే మునిగిపోయే నరసాపురానికి భూగర్భ డ్రెయినేజీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఊసే ఎత్తలేదు. అధ్వానంగా ఉన్న రహదారులు, డంపింగ్ యార్డు సమస్య, మత్య్సకారుల ఇబ్బందులు, ఆక్వా రైతుల కష్టాలు.. ఇలా జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలపై గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి నోరెత్తలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్