జగన్.. మేమేం చేశాం పాపం?
జగన్ సర్కారు అక్కసుతో పింఛనుదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అగ్నిగుండంలాంటి ఎండలో పింఛను కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం.
అవ్వాతాతల వేదన.. అరణ్యరోదన
మండే ఎండలో బ్యాంకుల వద్ద బారులు
ఊరూరా పింఛనుదార్ల అవస్థలు
బుట్టాయగూడెంలో బ్యాంకులో బారులు తీరిన పింఛనుదారులు
జగన్ సర్కారు అక్కసుతో పింఛనుదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అగ్నిగుండంలాంటి ఎండలో పింఛను కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం. ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఖాతాలు మనుగడలో లేకపోవటం, సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు తదితర సమస్యలు శుక్రవారం కూడా కనిపించాయి.
ఈనాడు, భీమవరం, న్యూస్టుడే, తణుకు గ్రామీణం, ఆచంట
బ్యాంకులన్నీ పింఛనుదార్లతో కిటకిటలాడాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కుతూ కిమీ మేర నడుచుకుంటూ వచ్చి బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. కొందరు ప్రయాణ ఖర్చులు పెట్టుకుని వచ్చినా..ఆధార్ అనుసంధానం కాకపోవటం, ఖాతా మనుగడలో లేకపోవటం, పింఛన్ సొమ్ము జమకావటం వంటి సమస్యలతో అవస్థలు పడ్డారు. ఎండ మండిపోతుంటే వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకుల్లో ఇబ్బంది పడ్డారు. బ్యాంకుల్లో నగదు జమకాక సచివాలయాలకు వెళ్లటం, అక్కడ సిబ్బంది సమాధానం చెప్పకపోవటంతో మళ్లీ బ్యాంకుల దగ్గరకు పరుగులు పెట్టడం కనిపించింది. నగదు విత్డ్రా చేసే దరఖాస్తు నింపడం రాని అవసరాన్ని ఆసరాగా తీసుకుని భీమవరం మండలం గొల్లవానితిప్పలో యూనియన్ బ్యాంకు బయట కొందరు యువకులు దరఖాస్తులు పూర్తి చేసినందుకు ఒక్కో పింఛన్దారు నుంచి రూ.50 వరకు వసూలు చేశారు.
55 కి.మీ.. రప్పించి.. నిరాశపరచి..
గెడ్డపల్లి నుంచి పింఛను కోసం వచ్చిన కొండరెడ్డి గిరిజనులు
పోలవరం మండల కేంద్రానికి 55 కి.మీ దూరంలో ఉన్న గిన్నెపల్లి, గెడ్డపల్లి ఆదివాసీ గ్రామాలకు చెందిన 20 మంది రెండు వాహనాలు కిరాయికి పెట్టుకుని వచ్చారు. ఒక్కొక్కరికి రూ.400 చొప్పున వాహనాలకే రూ.8వేలు ఖర్చు అయింది. ఊళ్లో కూలిపని మానుకుని వచ్చారు. భోజనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకొంటే రూ.10 వేలకు పైనే ఖర్చయింది. ఇంత వ్యయప్రయాసలు పడి వచ్చినప్పటికీ పెంటారెడ్డి, చంటమ్మలకు ఖాతాలో సొమ్ము జమకాలేదు. మళ్లీ ప్రత్యేక వాహనాలు పెట్టుకుని రావాలంటే పింఛను సొమ్ము కూడా సరిపోదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.
ఇద్దరి ఉసురు తీసి..
- పింఛన్ల పంపిణీలో జగన్ ఆడుతున్న రాజకీయ చదరంగంలో పండుటాకులు రాలిపోతున్నాయి. మండుటెండలో పింఛను కోసం వెళ్లి.. ఆచంట మండలం చిల్లేవారిపాలేనికి చెందిన తాయారు(69) ప్రాణాలు విడిచారు. పోలవరం బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ(55) ఎండలో అర కిలోమీటరు దూరం నడిచి వచ్చి అస్వస్థతకు గురై మరణించారు.
- ఎల్ అగ్రహారానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి తాడేపల్లిగూడెంలో మూడు బ్యాంకు ఖాతాలున్నాయి. నగదు జమయిందని తెలిసినా ఏ ఖాతాలో ఉన్నాయో తెలియక మూడు రోజులుగా తిరుగుతున్నారు. పరిశీలించగా నగదు జమకాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
రెండ్రోజులుగా విలపిస్తూ...
పెనుమంచిలి తూర్పుగరువుకు చెందిన 75 ఏళ్ల కొంబత్తుల సుగుణమ్మ రెండ్రోజులుగా మినీ బ్యాంకు, సచివాలయం, పోస్టాఫీˆసు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. జాబితాలో ఆమెకు స్టేÆట్ బ్యాంకులో జమైనట్లు ఉండగా.. నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని ప్రధాన బ్రాంచికి వెళ్లడం తెలియక రోదిస్తున్నారు.
నాకు మిగిలేది ఏమిటి?
‘మాది చివటం గ్రామం. నడవలేను.. ఇంటి వద్దే ఉంటా. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి పింఛన్ జమచేయడంతో రూ.500 ఆటో కట్టించుకొని ఇద్దరి సాయంతో వచ్చా. ఖాతా మనుగడలో లేదన్నారు. ఖాతాను బతికించేందుకు డబ్బులు కూడా చెల్లించాలని చెప్పారు. ఇలా అయితే నాకు మిగిలేది ఏమిటి?’అని వాపోయారు బీబీ.
ఎత్తుకుని తీసుకొచ్చారు..
మాది ఇరగవరం కాలనీ. మంచానికే పరిమితమయ్యాను. ఇంటికి పింఛన్ ఇస్తారనుకున్నా. కానీ బ్యాంకు ఖాతా లో వేయడంతో చాలా ఇబ్బంది పడ్డా. రూ.300కు ఆటో కట్టించుకుని ఇద్దరు నన్ను ఎత్తుకుని బ్యాంకుకు తీసుకొచ్చారు. అధికారులు స్పందించి ఇంటికి పింఛన్ అందించేలా చర్యలు తీసుకోవాలి.
అమ్మాయమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాల మీదకొచ్చినా స్పందించరా?
[ 17-05-2024]
ఏజెన్సీలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు గిరిపుత్రుల ప్రాణాలు తోడేస్తోంది. కుక్కునూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుక్కెడు తాగునీటికి నోచుకోక చెలమల్లోని మురికి నీరు తాగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటమే ఈ మరణాలకు కారణమైంది. -
ఆగని అరాచకపర్వం
[ 17-05-2024]
పోలింగ్ నాడు వైకాపా మూకలు చేసిన విధ్వంసకాండ..వారు గత అయిదేళ్లుగా చేస్తున్న అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది. పచ్చని పశ్చిమలో నెత్తుటి ఛాయలు చూపించింది. ఓటమి భయం ఆవరించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటమే లక్ష్యంగా పని చేశారు. -
కలిసి రాని కొబ్బరి!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. పెదవేగి, యలమంచిలి మండలాలు కొబ్బరిసాగులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యానంలో పెద్దపంటగా భావించే కొబ్బరిలో తెగుళ్ల బెడద తీవ్రస్థాయికి చేరింది. -
తేమ పేరుతో కోత
[ 17-05-2024]
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. -
ఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉదయం జరిగిన అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షకు మొత్తం 175 మంది హాజరు -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ ?
[ 17-05-2024]
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 118 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 66 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాక వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. -
అర్ధరాత్రి ఇసుక దందా
[ 17-05-2024]
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. -
నెత్తురోడిన రహదారులు
[ 17-05-2024]
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని రహదారులు గురువారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. -
కొప్పులవారిగూడెం ఘటనపై పోలీసుల అత్యుత్సాహం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో(ఈ నెల 13న) పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. -
లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె
[ 17-05-2024]
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే