logo

అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్‌ మీడియా ఖాతాదారులపై కేసు

ఓ తెదేపా మహిళా నాయకురాలిపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్‌ మీడియా ఖాతాదారులపై ఏలూరు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది.

Published : 06 May 2024 05:18 IST

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ తెదేపా మహిళా నాయకురాలిపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్‌ మీడియా ఖాతాదారులపై ఏలూరు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష తెదేపా అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. వైకాపాకు చెందిన కొందరు ఇటీవల ఆమె ఫొటోలను మార్పింగ్‌ చేసి అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతున్నారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని