‘అత్యుత్తమ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దుతా’
కడప నగరపాలక సంస్థ కమిషనర్గా సూర్యసాయిప్రవీణ్చంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలు, స్థితిగతులను పత్రికల ద్వారా తెలుసుకున్నానన్నారు. కడప నగరపాలక
బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్ సూర్యసాయిప్రవీణ్చంద్
కడప నగరపాలక, న్యూస్టుడే : కడప నగరపాలక సంస్థ కమిషనర్గా సూర్యసాయిప్రవీణ్చంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలు, స్థితిగతులను పత్రికల ద్వారా తెలుసుకున్నానన్నారు. కడప నగరపాలక సంస్థను రాష్ట్రంలోని అత్యుత్తమ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పారు. నగరాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా సలహాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం నగరపాలక సంస్థలోని కీలక విభాగాలకు చెందిన అధికారులతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంతో జరిగిన సమీక్షలో టెండర్ల దశలో ఉన్న పనులు మొదలుకుని పూర్తయ్యే దశలో ఉన్న పనుల వరకు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ● 14, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అధికారులను ప్రశ్నించారు. రాజీవ్మార్గ్ అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడానికి కారణాలపై సంబంధిత అధికారులను నిలదీశారు. ట్యాంక్బండ్ అభివృద్ధి పనులకు పిలిచిన టెండర్ల పురోగతిపై వివరాలు అడిగారు.● పారిశుద్ధ్య విభాగంపై చర్చిస్తూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాప్ పథకంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీల సంఖ్యపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని చిన్న, మధ్యతరహా, పెద్ద కాలువల పరిమాణాన్ని తెలపాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువలను తనిఖీ చేస్తానన్నారు. ప్రణాళిక విభాగంపై జరిగిన చర్చలో రహదారుల విస్తరణను ప్రస్తావించారు. సీఎం నిధులు మంజూరు చేసిన మూడు రహదారుల విస్తరణ పనుల్లో జాప్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ను కలిసిన కమిషనర్ : జిల్లా సచివాలయం : కడప నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సూర్యసాయి ప్రవీణ్చంద్ కలెక్టర్ విజయరామరాజును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కలెక్టర్, జేసీ సూచనలు, మేయర్ సహకారంతో కడప నగరాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.