ఆయనో బెట్టింగ్ ప్రసాద్
ప్రొద్దుటూరును ఎమ్మెల్యే రాచమల్లు శిప్రసాద్రెడ్డి క్రికెట్ బెట్టింగ్, జూదం, మట్కా, గుట్కా, దొంగనోట్ల తయారీ, మార్పిడికి అడ్డాగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
ఎమ్మెల్యే రాచమల్లు అవినీతిపై లోకేశ్ విమర్శనాస్త్రాలు
జనంతో పోటెత్తిన ప్రొద్దుటూరు పుర వీధులు
ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర
బహిరంగ సభలో మాట్లాడుతున్న లోకేశ్
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, ప్రొద్దుటూరు వైద్యం: ప్రొద్దుటూరును ఎమ్మెల్యే రాచమల్లు శిప్రసాద్రెడ్డి క్రికెట్ బెట్టింగ్, జూదం, మట్కా, గుట్కా, దొంగనోట్ల తయారీ, మార్పిడికి అడ్డాగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఎమ్మెల్యే పేరు బెట్టింగ్ ప్రసాద్గా మారుస్తున్నట్లు ఎద్దేవా చేశారు. తాను పాదయాత్రకు రాకముందే బెట్టింగ్ ప్రసాదుకు వణుకు పుట్టిందన్నారు. ప్రొద్దుటూరు లో గురువారం రాత్రి జరిగిన బహిరంగసభలో నారా లోకేశ్ మాట్లాడుతూ గతంలో రవాణా అధికారి వేషంతో రహదారులపై డబ్బుల వసూళ్లకు పాల్పడిన రోజులు మార్చిపోయావా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత కారుకు ఈఎంఐ కట్టలేక, అద్దె ఇంట్లో ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు రూ.వేల కోట్ల అధిపతి ఎలా అయ్యావని నిలదీశారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు కిరణ్కుమార్రెడ్డి, బావమరిది బంగారురెడ్డిలు ప్రొద్దుటూరును కేకులా కోసుకుని తింటున్నారని ఆరోపించారు. పట్టుమని రూ.వంద కోట్ల పనులు పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే అని లోకేశ్ విమర్శించారు. వైకాపా అధికారంలోకి రాగానే రెండు సెంట్ల ఇళ్ల స్థలాలిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు మండలం చౌటపల్లిలో రూ.Ëకోట్లు విలువ చేసే చర్చి భూములను కొట్టేశారని ఆరోపించారు. బీసీˆలంటే ప్రసాదురెడ్డికి పడదన్న లోకేష్.. తెదేపా జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను హత్య చేయించారని ఆరోపించారు. బొందిలి కార్పొరేషన్ ఛైర్మన్ రజిని దొంగనోట్ల చలామణి కేసులో పట్టుబడ్డారని, దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నారన్నారు. పేదల ఇళ్ల స్థలాల సేకరణలో భారీగా ప్రజాధనం లూఠీ చేశారన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే దోచుకున్న డబ్బునంతా కక్కిస్తామన్నారు. గతంలో ఉన్న కూరగాయల మార్కెట్ను కూలదోసి తాత్కాలిక మార్కెటు పేరుతో ఒక్కో అరుగుకు రూ.లక్ష వసూలు చేసి రూ.కోట్లు దండుకున్నారన్నారు. ప్రొద్దుటూరులో ఏ వ్యాపారం చేసినా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందేనని లోకేశ్ ఆరోపించారు. ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి అరాచక శక్తిగా మారారని, పురపాలక సంఘం పరిధిలో జరిగే అన్ని పనులకు సింగిల్ టెండరు వేయించి ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కర్ణాటక నుంచి అక్రమ డీజిల్ దిగుమతి వ్యవహారమంతా ఎమ్మెల్యే ప్రసాద్ అనుచరులే చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సోదరుడు కిరణ్కుమార్రెడ్డి భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని రూ.150 కోట్లతో తెదేపా హయాంలో మైలవరం జలాశయం నుంచి పైపులైను ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తే ఎమ్మెల్యే అడ్డుకుని ఇప్పుడు తాను పూర్తి చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా అధికారంలోకి రాగానే ప్రత్యేకాధికారిని నియమించి.. ప్రొద్దుటూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చేనేతలను తాను దత్తత తీసుకున్నానన్న లోకేశ్ క్లస్టర్లు, టెక్స్టైల్స్ కంపెనీలు తీసుకొస్తామని పునరుద్ఘాటించారు. అమ్మలాంటి కడపను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, సీఎం సురేష్ నాయుడు, మెట్టుపల్లి ప్రభాకర్రెడ్డి, ముక్తియార్, గోవర్దన్రెడ్డి, మన్మోహన్రెడ్డి, హరిప్రసాద్, రితేష్రెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువతతో సెల్ఫీ దిగుతూ...
బాబాయ్ని ఎవరు చంపారు? : ప్లకార్డులతో తెదేపా నాయకులు
తెదేపా నేతల ఆనందపరవశం
లోకేశ్ పాదయాత్రకు జనం పోటెత్తడంతో తెదేపా నేతలు ఆనందపరవశులయ్యారు. నంద్యాల జిల్లా నుంచి జిల్లాలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి జనం అనూహ్యంగా తరలివచ్చి లోకేశ్కు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రత్యేకించి యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు జనం అత్యధిక సంఖ్యలో తరలి రావడంపై నిఘా వర్గాలు సైతం ఆరా తీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.