ఝరికోన... ప్రగతి జరిగేనా?
సంబేపల్లె మండలం ఝరిదిన్నె వద్ద 2006లో నిర్మించిన ఝరికోన ప్రాజెక్టు ద్వారా రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలకు సాగు, తాగునీరందించాల్సి ఉన్నా 15 ఏళ్లుగా చుక్క నీరందని పరిస్థితి నెలకొంది.
ఏళ్లుగా అంచనాల పెంపు
నిధుల్లేక పడకేసిన పనులు
న్యూస్టుడే, రాయచోటి, సంబేపల్లె
సంబేపల్లె మండలం ఝరిదిన్నె వద్ద 2006లో నిర్మించిన ఝరికోన ప్రాజెక్టు ద్వారా రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలకు సాగు, తాగునీరందించాల్సి ఉన్నా 15 ఏళ్లుగా చుక్క నీరందని పరిస్థితి నెలకొంది. ఎన్నికలొచ్చినప్పుడల్లా రైతులను ఊరడించే మాటలు చెబుతున్న ప్రజాప్రతినిధులు కాలువల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో పనుల పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
జిల్లాలో రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలు అత్యంత కరవు పీడిత ప్రాంతాలు. 2005లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు అప్పట్లో రూ.39 కోట్లతో సంబేపల్లె, కె.వి.పల్లె, కలకడ మండలాల సరిహద్దులోని ఝరిదిన్నె వద్ద బాహుదా నదిపై ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్టుకు తొలుత తూము ప్రతిపాదన లేకపోవడంతో కట్టకు అలుగు ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తిచేశారు. దిగువన ఉన్న సుండుపల్లి మండలంలోని బాహుదా నదీ పరివాహక ప్రాంతంలో నీరు పారకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మండల రైతులు, బహుదా నది జలసాధన సమితి చేపట్టిన ఆందోళనలతో తూము ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నుంచి నీరు పంటపొలాలకు నింపాలంటే గ్రావిటీ ద్వారా వెళ్లే పరిస్థితి లేదు. ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసి కాలువలకు నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఎత్తిపోతల పథకంతోపాటు కాలువల నిర్మాణానికి తొలుత రూ.40 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేశారు. మూడేళ్లు గడిచినా నిధులు రాకపోవడంతో అవి కాస్త మూలన పడ్డాయి ఇటీవల.తాజాగా ఉన్నతాధికారులు పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టడంతో తాజాగా రూ.139 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. గత నాలుగేళ్లుగా నిరీక్షించినా నిధుల లేమితో పనులు సాగకపోగా, మరోవైపు అంచనాలలు పెంచుకుంటూపోతున్నారు. సంబేపల్లె, సుండుపల్లి మండలాల పరిధిలో సుమారు ఎటు వెళ్లినా పదిహేను కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా భూసేకరణ పనులు పూర్తి చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎత్తిపోతల పథకం సిద్ధం కాకపోవడంతో ఏటా బాహుదాలో ప్రవహించే నీటితో ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నా ఆయకట్టుకు సాగునీరందని దుస్థితి నెలకొంది.
గడువు సమీపిస్తున్నా...
సాగు, తాగునీరందించేందుకు ఉన్న జలవనరులను బాగుచేసి ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి, ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని అధికార పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేశారు. కరపత్రాలు ముద్రించి మరీ ఎన్నికల్లో ప్రచారం సాగించారు. ప్రభుత్వం ఏర్పడితే నిధులొచ్చి సాగుకు నీరందుతుందని ఆశించిన రైతన్నలే కాకుండా తాగునీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు నేతల మాటలు నమ్మారు. ఎన్నికల్లో అనుకూల ఫలితమిచ్చినా హామీలు అమలులో నేతలు విఫలమయ్యారు. ప్రభుత్వ పదవీ కాలం గడువు సమీపిస్తున్నా నేటికీ కాలువల నిర్మాణ పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. గత నాలుగేళ్లుగా సాగని పనులు ఏడాదిలో ఎలా సాధ్యమవుతాయంటూ రైతులు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఉంచి సాగునీటి కాలువలు నిర్మించాలని తరచూ ఆందోళనలు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయచోటి, రాజంపేట ఎమ్మెల్యేల పరిధిలో ప్రాజెక్టు ఉన్నప్పటికీ నిధులు సమీకరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు నిర్మిత లక్ష్యం నెరవేరకపోగా, 2010-14 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డి మాత్రం ప్రాజెక్టు నుంచి తాగునీటిని ఆయన సొంత ప్రాంతమైన కలికిరి, కలకడ, కె.వి.పల్లె మండలాలకు పైపులైన్ల ద్వారా తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. ఈ ప్రాంత నేతలు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి అసంపూర్తి పనులు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కరవు పీడిత ప్రాంతంలో నిర్మించిన ఝరికోన ప్రాజెక్టు నుంచి సాగు, తాగునీరందించేందుకు అవసరమైన కాలువలు, ఎత్తిపోతల పథకం నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదలశాఖ బాధ్య ఎస్ఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఝరికోన ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి తాజాగా అంచనాలు ప్రభుత్వానికి నివేధించామని, నిధులు రాగానే పనులు చేపడతామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.