రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ వాటానే అధికం
రాష్ట్రంలో అమలు అవుతున్న అనేక పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే అధికంగా ఉందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు.
భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్
మాట్లాడుతున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్
జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్టుడే: రాష్ట్రంలో అమలు అవుతున్న అనేక పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటానే అధికంగా ఉందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం స్థానిక ముద్దనూరు రహదారిలోని నానుబాల ఫంక్షన్ హాల్లో జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తారని తెలిపారు. ఏపీ అభివృద్ధికి ఇప్పటికే రూ.10 వేల కోట్లు అందజేశారని గుర్తుచేశారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 10వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటనకు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ను కోరిన అజిత్ మద్దతుదారులు
-
Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు
-
Flight Fares: భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్ ధరలకు రెక్కలు
-
Jaane Jaan Review: రివ్యూ: జానే జాన్.. కరీనా తొలి ఓటీటీ మూవీ మెప్పించిందా?