జగనన్నా.. శంకుస్థాపనలేనా?
9 నెలలు... లెక్క ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు ఉన్న సమయమిది! 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపా నగరాభివృద్ధిపై ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి ఉన్న సమయమింతే.
పనులు పూర్తి చేసేదేమైనా ఉందా?
నిధులకు ఎదురు చూస్తున్న శిలాఫలకాలు
ఎన్నికల్లోపు పూర్తయ్యేది ప్రశ్నార్థకమే
న్యూస్టుడే, కడప నగరపాలక
9 నెలలు... లెక్క ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు ఉన్న సమయమిది! 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపా నగరాభివృద్ధిపై ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి ఉన్న సమయమింతే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప నగర పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పునరుద్ధరణ పనులు పూర్తయిన రాజీవ్పార్కు - రాజీవ్ మార్గ్ల ప్రారంభోత్సవం, బ్రహ్మంసాగర్ జలాల పంపిణీ పనులకు శంకుస్థాపనతో సరిపెడతారా? లేక వైకాపా ఆవిర్భావం నుంచి ఇస్తున్న హామీల అమలుకు చర్యలు తీసుకుంటారా? లేక ఇప్పటికింతే అని సరిపెడతారా? అన్న అంశం కడప నగరంలో తీవ్ర చర్చనీయాంశం మారింది.
బుగ్గవంకకు ఇరువైపులా 40 అడుగుల రహదారి నిర్మాణం పనులను 2020లో ప్రారంభించారు. రూ.14.50 కోట్లతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. రోడ్డు నిర్మాణంలో భాగంగా యర్రముక్కపల్లి ప్రాంతంలో నివాస గృహాల పక్కన దాదాపు 10 అడుగుల లోతు ఆరు అడుగుల వెడల్పుతో కాలువ నిర్మాణం కోసం భారీ గుంతలు తీశారు. కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో దాని పక్కనున్న నివాస గృహాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.
* సీపీ బ్రౌన్ గ్రంథాలయం భవన నిర్మాణాలకు 2021 జులై 9న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీని కోసం కేటాయించిన రూ.6 కోట్ల నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. నగరంలో వరద నీటి కాలువల నిర్మాణానికి రూ.69 కోట్ల విలువైన పనులకు ఇదే రోజున ఆయన శంకుస్థాపన చేశారు. ఆ పనుల ఊసే లేకుండా పోయింది.
* రూ.250 కోట్ల నిధులతో మూడు కీలక రహదారుల విస్తరణకు కూడా శంకుస్థాపన చేయగా ఇప్పటికీ స్థల సేకరణ దశలోనే పనులు ఉన్నాయి. బండి కనుమపై ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టడానికి ఉత్తర్వులు కూడా జారీ చేసి తర్వాత రద్దు చేశారు. వైవీయూ వద్ద భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.
* రూ.72 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ మురుగు పారుదల పనులు నిరర్థకంగా మారాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. దేవునికడప చెరువుకట్టను ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేయడానికి రూ.55 కోట్లతో టెండర్లు ఖరారు చేసి సుమారు రెండేళ్లు దాటింది. ఇప్పటి వరకూ నిధులు విడుదల కాలేదు.
* అమృత్ 2.0 కింద నగరంలో నీటి సరఫరాను మెరుగుపరచడానికి, చెరువులు ఆధునికీకరణ, జగనన్న కాలనీలు, టిడ్కో నివాసాలకు నీటి సరఫరా, భూగర్భ మురుగు నీటిపారుదల పనులకు రూ.350 కోట్లతో అనుమతులు వచ్చాయి. ఈ పనులు పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.230 కోట్లు విడుదల చేయాలి.
* 2021లో రోడ్ల విస్తరణకు మంజూరు చేసిన నిధులు విడుదల చేయకుండానే ఆ నిధుల్లో రూ.55 కోట్ల మిగులు చూపారు. ఈ మొత్తంతో నగరపాలక కార్యాలయం నూతన భవన నిర్మాణానికి, బుగ్గవంకపై మరో రెండు వంతెనల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ పూర్తి కావాలంటే ముఖ్యమంత్రి జగన్ కడపకు నిధులు విడుదల చేయించాలి.
* ఈ నెల 10న కడపకు వస్తున్న ఆయన ఈ అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఈ పనులు ఇప్పటికింతే అని నగరవాసులు సరిపెట్టుకోక తప్పదు. ఈ పనులు చేసి ఎన్నికలకు వెళతారా..? లేక ఈ పనులు చేస్తామని మళ్లీ హామీ ఇస్తూ ఎన్నికలకు వెళతారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
* మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అమృత్ పథకం కింద బ్రహ్మంసాగర్ నుంచి 1.5 టీఎంసీల నీటిని కడపకు తీసుకు రావడానికి తగిన జీవో జారీ చేశారు. ఈ పనులకు రూ.570 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా దాదాపు రూ.350 కోట్లు కేటాయించాలి. నిధులు ఇస్తే బ్రహ్మంసాగర్ పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొడవలకు దిగితే రౌడీషీట్
[ 17-05-2024]
మండలంలోని పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గొడవలకు దిగితే రౌడీషీట్ తెరవడంతో పాటు జిల్లా, మండల బహిష్కరణ చేస్తామని ... -
నిబంధనలకు పాతర... ఇసుకాసురుల జాతర..!
[ 17-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండి పడింది. -
బద్వేలులో భూఆక్రమణ!
[ 17-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన ఎకరా విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల కన్ను పడింది. -
వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
[ 17-05-2024]
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. -
నిప్పులార్పగలరు... భవనాలూ నిర్మించగలరు
[ 17-05-2024]
దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలిస్తాయి. వీటిని ఆయుధాలుగా చేపట్టిన వారు విజయాలను సాధిస్తారనే స్వామి వివేకానందుడి సూక్తిని నిజం చేశారు ప్రొద్దుటూరు అగ్నిమాపక, విపత్తుల శాఖలో ఫైర్మెన్గా పని చేసే ఒ.నరేంద్రకుమార్. ఉద్యోగం రాకముందు బేల్దారి పని చేసి జీవించేవారు. -
సీఎం బటన్ నొక్కినా జమకాని నగదు
[ 17-05-2024]
సీఎం జగన్ వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా నిధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. -
ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
[ 17-05-2024]
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. -
మండిపల్లి గృహనిర్బంధం
[ 17-05-2024]
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని పోలీసులు ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో
[ 17-05-2024]
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
-
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
-
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM