అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు.
ఒంటిమిట్ట చెరువులో మట్టి దోపిడీ
ఒంటిమిట్ట చెరువులో మట్టిని ట్రాక్టరులో నింపుతున్న పొక్లెయిన్
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. దీనికి అటు నీటిపారుదల, ఇటు రెవెన్యూ శాఖల నుంచి అనుమతి పొందలేదు. మండల రెవెన్యూ అధికారి కార్యాలయానికి కూత వేటులో ఉన్న తటాకంలో ఇష్టారాజ్యంగా పట్ట పగలే మట్టి తరలిస్తున్నారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎగుడుదిగుడుగా ఉన్న నేలను చదును చేయాలని తితిదే అధికారులు నిర్ణయించారు. ఇటీవల టెండర్లు పిలిచారు. ఓ గుత్తేదారు పనులను దక్కించుకున్నారు. చెరుడు కట్ట రోడ్డు నుంచి కడప-రేణిగుంట జాతీయ రహదారి మధ్యలో ఖాళీ స్థలాన్ని సమాంతరంగా చేస్తున్నారు. దీని కోసం సమీపంలోని చెరువు నుంచి అనధికారికంగా మూడు రోజులుగా యంత్రాలతో మట్టి తవ్వుతున్నారు. మమ్మల్ని అడ్డుకునేవారెవరు అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. ఎన్నికల వేళ అధికారిక ఉత్తర్వులు తీసుకోవాలనే నిబంధనను విస్మరించారు. ఆలయం బ్రహ్మోత్సవాల అవసరాలకు మన్ను తీసుకుంటున్నామని తితిదే అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, టెండర్లు పిలవకుండా, గుత్తేదారులతో ఒప్పందం చేసుకోకుండా అంతా మౌఖికంగా చేస్తున్నారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ముసుగులో ప్రైవేటు, వాణిజ్య అవసరాల నిమిత్తం తీసుకెళ్లడానికి మరికొందరు యత్నిస్తున్నారు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ ఈఈ వెంకట్రామయ్యను ‘న్యూస్టుడే’ సంప్రదించగా చెరువులో మట్టి కావాలని ఇంతవరకు ఎవరూ తమను అడగలేదని తెలిపారు. తహసీల్దారు వెంకటరమణను సంప్రదించగా మట్టి తరలింపునకు దరఖాస్తు చేశారని, ఇంకా అధికారిక అనుమతి ఇవ్వలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 27-04-2024]
తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ తెలిపారు. -
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో