logo

తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ తెలిపారు.

Published : 27 Apr 2024 10:47 IST

క‌ల‌స‌పాడు: తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశ‌న్న‌ కుమారుడు బొజ్జా కార్తీక్‌, ఎన్డీయే కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి, తెదేపా ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెదేపా,  జనసేన భాజపా నాయకులు భద్రయ్య, నాగేంద్రరావు, రోషిరెడ్డి, సలీం, ఈశ్వర్ రెడ్డి, రామాంజనేయరెడ్డి, సురేష్ కుమార్ రెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని