వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
నడింపల్లెలో వృద్ధుడిని సన్మానించి ఓటు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా
రామసముద్రం, న్యూస్టుడే: వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. పల్లెల్లో వీధుల దుస్థితి, అస్తవ్యస్తంగా ఉన్న మురుగు కాలువలను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధికి కేంద్రం విడుదల చేసి నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించుకుని గ్రామ పంచాయతీలను నిర్వర్యం చేశారని మండిపడ్డారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులను దిష్టిబొమ్మలుగా మార్చేసిన దుస్థితి ఈ వైకాపా ప్రభుత్వంలో నెలకొందని ఆవేదన వ్యక్తపరిచారు. అభివృద్ధి నిరోధక వైకాపా ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. అభివృద్ధికి బ్రాండు అంబాసిడర్గా ఉన్న చంద్రబాబు నాయుడును జరుగుతున్న ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రిని చేద్దామని ఓటర్లకు పిలుపునిచ్చారు. మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు సీఆర్.నారాయణరెడ్డి, కృష్ణమరాజుయాదవ్, శివకుమార్రెడ్డి, చిన్నూస్వామి, రాజేష్, నాగరాజయాదవ్, ఎల్.శివ, కిట్ట, రమేష్రెడ్డి, వెంకటేష్, చిన్నస్వామి, నరసింహులు, శ్రీనివాసులురెడ్డి, రఘునాథరెడ్డి, గంగాధర్, రెడ్డెప్ప, శ్రీనివాసులు, గంగప్ప తదితరులు పాల్గొన్నారు.
అచ్చం బాలకృష్ణలాగే...
బి.కొత్తకోట, ములకలచెరువు గ్రామీణ : బి.కొత్తకోట, ములకలచెరువులలో ఆదివారం నందమూరి బాలకృష్ణ డూప్ రోడ్షోను నిర్వహించారు. ప్రచార రథంపై నుంచి అచ్చం బాలకృష్ణలాగే హావభావాలు ప్రదర్శిస్తూ.. తెదేపా వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ తెదేపా నాయకులతో కలసి వీధుల గుండా ముందుకు సాగారు. ఎన్డీఏ అభ్యర్థులు జయచంద్రారెడ్డి, నల్లారి కిరణ్కుమార్రెడ్డిలను గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానికులు డూప్ బాలకృష్ణను ఆసక్తిగా తిలకించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.