logo

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి

ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్ర‌జ‌లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని  ఎస్సై నాగముర‌ళీ అన్నారు.

Published : 06 May 2024 11:09 IST

కలసపాడు: ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్ర‌జ‌లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని  ఎస్సై నాగముర‌ళీ అన్నారు.  సోమవారం మండలంలోని కట్టకింద పల్లె, చింతల‌పల్లె, మహానంది పల్లె,  ముదిరెడ్డి పల్లె, లింగారెడ్డి పల్లె త‌దిత‌ర‌ గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ దళాలతో కవాతు నిర్వహించారు. అనంతరం  ప్రజలతో గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలకు  లొంగకూడదని ఓటర్లు సూచించారు. గ్రామాల్లో ఎవరైనా ఏకపక్ష ఓటింగ్‌కు ఒత్తిడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగేంద్ర, పోలీసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని