అంగన్వాడీ కేంద్రాలకు అద్దె పెరిగింది
చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటుచేసిన అంగన్వాడీ కేంద్రాలకు అద్దె పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూస్టుడే, వెంకట్నగర్(కాకినాడ)
కాకినాడలో అద్దె భవనంలో సాగుతున్న అంగన్వాడీ కేంద్రం
చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటుచేసిన అంగన్వాడీ కేంద్రాలకు అద్దె పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయిదు నెలలుగా మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేస్తుండటంతో అక్కడికి వచ్చేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్దెల మాట అటుంచితే పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన అద్దెలు సరిపోక తమ సొంత నగదును అంగన్వాడీ సిబ్బంది చెల్లించేవారు. ఇప్పుడు అద్దె రుసుములు పెంచడం కాస్త ఊరటనిచ్చే అంశమని వారు అంటున్నారు.
భవనాలు పూర్తయితే తప్పనున్న భారం
కాకినాడ జిల్లాలో మొత్తం 10 ప్రాజెక్టులకు 1,986 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సొంత భవనాల్లో 706, అద్దెవి 1,107, అద్దె లేనివి 173 ఉన్నాయి. అద్దె కేంద్రాలు రూరల్ ప్రాజెక్టులో 767, అర్బన్ పరిధిలో 340 ఉన్నాయి. నాడు-నేడు పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరో 98 కేంద్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. పెద్దాపురం ప్రాజెక్టు పరిధిలో మొత్తం 26 కేంద్రాలు కేటాయించారు. పిఠాపురం ప్రాజెక్టు పరిధిలో 25 కేంద్రాలు, రంగంపేట ప్రాజెక్టు పరిధిలో 7, సామర్లకోట ప్రాజెక్టు పరిధిలో 2, శంఖవరం ప్రాజెక్టు పరిధిలో 6, తాళ్లరేవు ప్రాజెక్టు పరిధిలో 9, తుని ప్రాజెక్టు పరిధిలో 23 కేంద్రాల్లో పనులు చేపట్టారు. ఇవి అందుబాటులోకి వస్తే చాలా వరకు అద్దె భారం తగ్గనుంది.
శంఖవరంలో నిర్మాణ దశలో..
పెంపు ఇలా...
అంగన్వాడీ కేంద్రాలకు కొత్త అద్దెలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు ఒక రేటు, పట్టణాలు, కార్పొరేషన్లకు వేర్వేరు ధరలను నిర్ణయించింది.
ఉత్తర్వులు అందాయి....
అంగన్వాడీ కేంద్రాల అద్దెలు పెంచుతూ ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 1,107 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. త్వరలోనే నిబంధనల ప్రకారం పెంచిన అద్దెలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
కొండా ప్రవీణ, పీడీ, ఐసీడీఎస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.