ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.
పురందేశ్వరిని, రామకృష్ణారెడ్డిని సత్కరిస్తున్న ముస్లిం పెద్దలు
అనపర్తి గ్రామీణం, న్యూస్టుడే: మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన తెదేపా, భాజపా, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో అనపర్తి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తెదేపా నేత కే.ఎస్.జవహర్, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుతో కలిసి ఆమె పాల్గొన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు ఒక చోట సమావేశమైతే నరేంద్రమోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్కల్యాణ్ శక్తి కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు అనాలోచితంగా ఫ్యాను స్పీడును 151లో పెట్టేశారని, రాష్ట్రం కకావిలకంగా తయారయిందన్నారు. అప్పు, అవినీతి, అబద్ధాలను పునాదిగా చేసుకొని వైకాపా అయిదేళ్లు పాలన సాగించిందన్నారు. రూ.14 లక్షల కోట్ల అప్పు భారం రాష్ట్రంపై ఉందని, ప్రతి ఒకరిపై రూ.2 లక్షల అప్పు ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాలకు డబ్బు ఇచ్చింది మోదీయేనన్నారు. నాడు-నేడు నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులన్నారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరితో కలిసి పోటీ చేయడం అదృష్టంగా బావిస్తున్నానన్నారు. చంద్రబాబు ఆదేశాలతో భాజపాలో చేరానని, బాధతో తెలుగుదేశం పార్టీని వీడుతున్నానన్నారు. ఎన్డీఏ అభ్యర్థులుగా తాను, పురందేశ్వరి విజయం సాధిస్తే కెనాల్ రోడ్డును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించేందుకు, రైల్వే హాల్టులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తొలుత అనపర్తి శివారు నుంచి కారు ర్యాలీగా పురందేశ్వరిని సభా వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ఎన్టీఆర్, మూలారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెదేపాకు చెందిన 20 కుటుంబాలు భాజపాలో చేరగా, పురందేశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరిని ముస్లిం పెద్దలు సత్కరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.