ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా..
గెలుపు కోసం వైకాపా నేతల హామీల బాకాలు
కాకినాడ-రాజమహేంద్రవరం కలిపేస్తారట..
‘‘కాకినాడ, రాజమహేంద్రవరం లను జంట నగరాలైన హైదరాబాద్- సికింద్రాబాద్లా ఎందుకు కలపకూడదండీ.. రోడ్లు, వంతెనలు అభివృద్ధి చేసి జంట నగరాలు చేసేస్తాం... నా ఆస్తి అమ్మయినా సరే మోరంపూడి పై వంతెన పూర్తిచేస్తానని చెబుతున్నా. (రాజమహేంద్రవరం నగర వైకాపా అభ్యర్థి, ఎంపీ మార్గాని భరత్ హామీలివి)
400 గ్రామాలకు రూ.400 కోట్లు ఇస్తారట..
‘‘కాకినాడ పార్లమెంటు పరిధిలో 400 గ్రామాలు దత్తత తీసుకుంటా.. రాబోయే అయిదేళ్లలో ఒక్కో గ్రామానికి రూ.కోటి చొప్పున రూ.400 కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి చేస్తా.. నిరుద్యోగ యువతకు భారీ నైపుణ్య అభివృద్ధి కేంద్రం పెట్టి.. ఏటా 5 వేల నుంచి 6 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో చేరేలా చూస్తాం. పరిశ్రమలు తీసుకొస్తా’. (కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రవచనం)
ఈనాడు, కాకినాడ: మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. గత హామీలు గుర్తుకొచ్చాయో ఏమో.. కొత్తవాటి ఊసే లేకుండా ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. మా నాయకుడి కంటే మేమేం తక్కువా..? అనుకున్నారేమో..అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీచేస్తున్న వైకాపా అభ్యర్థులు ఎడాపెడా ఆచరణ సాధ్యంకాని హామీలు దంచేస్తున్నారు. ప్రస్తుతం కొందరు నేతల హామీలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. వీరి మాటలు వింటుంటే.. ఎవరు వెర్రివాళ్లనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
అంతన్నారు.. ఇంతన్నారు..
రాజమహేంద్రవరం ఎంపీగా వైకాపా ఎంపీ భరత్ తన మార్కు చూపలేకపోయారు. తాజా ఎన్నికల్లో ఈ సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. హామీలు గుప్పించేస్తున్నారు. 2022 జులై 16న మాట్లాడుతూ.. వచ్చే ఏడాదికి మోరంపూడి ఫ్లై ఓవర్ పూర్తిచేస్తాం అన్నారు. మాటిచ్చి రెండేళ్లయినా పూర్తిచేయలేకపోయారు. ఇప్పుడు జంట నగరాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
ఆ లెక్కేంటో చెప్పరూ
కాకినాడ[ లోక్సభ వైకాపా అభ్యర్థి చలమలశెట్టి గతంలో ప్రజారాజ్యం, వైకాపా, తెదేపా నుంచి పోటీచేసి ఓడారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తూ మ్యానిఫెస్టో తెరమీదికి తెచ్చారు. ఎంపీ నిధులు ఏటా రూ.5కోట్లకు మించి వచ్చే పరిస్థితిలేదు.. ఈయన, కుటుంబ సభ్యుల ఆస్తి అఫిడవిట్ ప్రకారం రూ.149.99 కోట్లు చూపారు. మరి అయిదేళ్లలో 400 గ్రామాలకు రూ.400 కోట్లు ఎలా ఖర్చుచేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది.
స్కిల్ రాగం
వైకాపా జమానాలో రోడ్లు, వీధి దీపాలు లేవని కాకినాడ గ్రామీణంలోని ఓ ఐటీ సంస్థ వెళ్లిపోతోంది. శంకుస్థాపనలు చేసినా కదలిక లేని పారిశ్రామిక ప్రాంగణాలూ ఉన్నాయి. సవ్యంగా నడుస్తున్న స్కిల్ కేంద్రాలపై బురద జల్లి.. ఇప్పుడు కొత్తగా వీరు స్కిల్ రాగం వినిపిస్తున్నారు. రూ.500 కోట్లతో సైన్స్ ఎంటర్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులే అయిదేళ్లలో ఈ ప్రభుత్వం చేయలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.