ఆర్థిక సాయం... అన్నదాతకు ప్రయోజనం
సాధారణంగా అందరి దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఆర్థిక పరపతి ఉన్నవారికి బ్యాంకులు ముందస్తుగా ఖర్చుచేసుకుని తరువాత చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ ‘క్రెడిట్ కార్డు’లను
అండగా నిలిచే ‘కిసాన్ క్రెడిట్ కార్డులు’
న్యూస్టుడే, వికారాబాద్
సాధారణంగా అందరి దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఆర్థిక పరపతి ఉన్నవారికి బ్యాంకులు ముందస్తుగా ఖర్చుచేసుకుని తరువాత చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ ‘క్రెడిట్ కార్డు’లను మంజూరు చేస్తున్నాయి. ఇదే తరహాలో రైతుకు కూడా అవసరానికి ఉపయోగపడేలా కేంద్రం ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ (కెసిసి)ను గతంలోనే ప్రవేశపెట్టింది. దీని గురించి సరైన అవగాహన లేక అధిక శాతం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించి కార్డు మార్గదరకాలను, ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మీదట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సాయాన్ని లబ్ధిదారుడు ఎప్పుడైనా పొందేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
అవసరమున్నప్పుడు తీసుకునేలా..
కేంద్రం కిసాన్ సమ్మాన్నిధి కింద ఏటా మూడుసార్లు రూ.2 వేల చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతుకు ఆర్థిక సాయమందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుబంధు కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు ఈ మొత్తం బ్యాంకుల ద్వారా చేతికందుతోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం కూడా మంజూరవుతోంది. దీనినీ బ్యాంకు నుంచే చెల్లిస్తున్నారు. అయితే రైతు తనకు అవసరమున్నప్పుడే నగదు తీసుకొని వాడుకునేలా 1998లోనే ‘కిసాన్ క్రెడిట్ కార్డు’లను ప్రవేశపెట్టింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొనుగోలుకు ముందస్తుగా తీసుకునేందుకు వారికున్న పరిమితి మేర ఈ కార్డు చెల్లుబాటయ్యే వీలు కల్పించారు.
ఇప్పటికి 50 వేల మందికి జారీ
జిల్లాలో మొత్తం 2.39 లక్షల మంది రైతులున్నారు. ఇందులో అన్ని అర్హతలుండి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా 1.9 లక్షల మంది ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ పాటికే 50 వేల వరకు రూపే కార్డులు, కేసీసీ కార్డులను పంపిణీ చేశారు. ఇంకా సుమారు 1.5 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. అన్ని జాతీయ, వాణిజ్య, ప్రైవేటు, గ్రామీణ, సహకార బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందించేలా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ ప్రయోజనాలు వర్తించే వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఐదేళ్ల కాలపరిమితి..
భూమి ఉండి 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న రైతులు ఈ కార్డు పొందే వీలుంది. తమ దగ్గరలో ఖాతా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకును సంప్రదించొచ్ఛు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డుతో పాటు (ఆధార్, ఓటరు, డ్రైవింగ్ లైసెన్సు.. తదితర ఏదైనా) భూమి పాసుపుస్తకాన్ని తీసుకెళ్లి బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవ కేంద్రాల్లోనూ కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు పత్రాలు పొందొచ్ఛు వివరాలన్నీ సరిచూసుకుని సంబంధిత బ్యాంకులు ఐదేళ్ల కాల పరిమితితో కూడిన ఈ కార్డులను మంజూరు చేస్తాయి. వ్యక్తిగత రహస్య కోడ్ను అందిస్తారు.
అధిక వడ్డీ బాధలు ఉండవు: గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
రైతులకు పంట సాయం సకాలంలో చేతికందని పరిస్థితుల్లో కేసీసీ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేటు వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పు తెచ్చుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది. అర్హత ఉన్న రైతులందరికీ దశల వారీగా ఈ కార్డులు చేరేలా చూస్తాం. బ్యాంకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తాం. ఇప్పటికే లబ్ధిదారుల జాబితా ఆయా బ్యాంకులకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.