నిధుల్లేవంటూ..నిత్యం నరకం చూపిస్తూ!
చింతలేని రహదారుల వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభించిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కష్టాల్లో పడింది. ప్రధాన నగరంలోని కీలక రహదారులపై చేపట్టిన పైవంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లపై పడుతున్న గుంతలను
పైవంతెనల నిర్మాణంలో గుత్తేదారుల నిర్లక్ష్యం
బిల్లులు ఆలస్యమంటూ నత్తనడకన ‘ఎస్సార్డీపీ’ పనులు
అస్తవ్యస్తంగా మారిన రోడ్లు
ఈనాడు, హైదరాబాద్
చింతలేని రహదారుల వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభించిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కష్టాల్లో పడింది. ప్రధాన నగరంలోని కీలక రహదారులపై చేపట్టిన పైవంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లపై పడుతున్న గుంతలను అలాగే వదిలేస్తూ, బారికేడ్లు ఏర్పాటు చేయకుండా పనులు చేస్తున్నారు. గడువు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. గుత్తేదారులు, ఇంజినీర్ల నిర్లక్ష్యంతో ఆయా రోడ్లపై పౌరులు నిత్యం నరకం చూస్తున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని గుత్తేదారులు, చిన్న చిన్న కారణాలకే కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఇంజినీర్లు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని, లేకుంటే మరో రెండేళ్లు రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్ చౌరస్తా, నాగోల్, సాగర్ రింగు రోడ్డు-ఎయిర్పోర్టు మార్గం, ఆర్టీసీ క్రాసురోడ్డు, చంచల్గూడ జైలు రోడ్డు, ఆరాంఘర్ రహదారి, కొండాపూర్ రోడ్డు, గచ్చిబౌలి చౌరస్తా, ఇతరత్రా రోడ్డు మార్గాల్లో జనాలు అవస్థలు పడాల్సిందేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆర్టీసీ క్రాసు రోడ్డు ఆందోళనకరంగా..
ఆర్టీసీ క్రాస్రోడ్డు సమీపంలో పడిన గోతుల్లో నిలిచిన నీరు
వీఎస్టీ కూడలి నుంచి ఇందిరా పార్కు వరకు నాలుగు లైన్ల ఉక్కు వంతెన పనులు రెండున్నరేళ్ల కిందట మొదలయ్యాయి. ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా ఇంకా 50శాతం దాటలేదు. పిల్లర్ల నిర్మాణమూ అంతంతే. మూడు నెలల కిందట వీఎస్టీ కూడలి వద్ద ర్యాంపు కోసం తవ్విన గుంతలు అలాగే ఉన్నాయి. రోజువారీ పురోగతి 0.5శాతం కూడా ఉండట్లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. బిల్లులు ఆలస్యమంటూ గుత్తేదారు నత్తనడకన పనులు చేస్తున్నారు. దీంతో విద్యానగర్ నుంచి లోయర్ ట్యాంక్బండ్ రోడ్డులో ప్రయాణించేవారు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక్కడి హోటళ్లు, థియేటర్లకు వచ్చేవారు రోడ్లపై వాహనాలు నిలుపుతుండటంతో రాకపోకలు మరింత క్లిష్టంగా మారాయి.
పైవంతెన పొడవు.. 2.8 కి.మీ.
ప్రాజెక్టు వ్యయం.. రూ.356 కోట్లు
నల్గొండ క్రాసు రోడ్డు నుంచి యాతనే
సంతోష్నగర్లో ఇరుకుగా మారిన రహదారి
రెండున్నరేళ్ల కిందట నల్గొండ ఎక్స్రోడ్డు పైవంతెన నుంచి ఒవైసీ ఆస్పత్రి కూడలి వరకు ఉక్కు వంతెన నిర్మాణం మొదలైంది. రెండేళ్లలో పూర్తవ్వాలనేది నిబంధన. బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తున్నారంటూ గుత్తేదారు నెమ్మదిగా పనులు చేస్తున్నారు. ఇంకా సగం పూర్తికాలేదు. రోడ్డంతా తవ్వేసి వదిలేశారు. మూడు కి.మీ. పొడవునా మట్టి కుప్పలు, గుంతలే కనిపిస్తున్నాయి. భూసేకరణలో భాగంగా నిర్మాణాలను పూర్తిగా తొలగించలేదు. సర్వీసు రోడ్డు ఆక్రమణల్లోనే ఉంది. ప్రయాణికుల వాహనాలు కిలోమీటరు ప్రయాణించేందుకు 20 నిమిషాలు పడుతోంది.
పైవంతెన పొడవు.. 3.38 కి.మీ.
ప్రాజెక్టు వ్యయం.. రూ.523.37 కోట్లు
ఆరాంఘర్ చౌరస్తా వరకు విధ్వంసం
జూ నుంచి ఆరాంఘర్ మధ్య లేస్తున్న దుమ్ము
రెండేళ్ల కిందట జూ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పైవంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంలోని పొడవైన పైవంతెనల్లో ఇది రెండోది. 2023లో పనులు పూర్తవ్వాలనేది నిబంధన. నత్తనడకన సాగుతుండటంతో రెండేళ్లు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు జరుగుతోన్న ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. పిల్లర్ల గుంతల వద్ద బారికేడ్లు ఉండట్లేదు. సూచిక బోర్డులు లేవు. సర్వీసు రోడ్డు పునరుద్ధరించలేదు.
పైవంతెన పొడవు.. 4 కి.మీ.
ప్రాజెక్టు వ్యయం.. రూ.636.80 కోట్లు
అన్ని ప్రాంతాల్లో అదే తీరు
ఎల్బీనగర్ నాగోల్ మధ్య స్తంభించిన ట్రాఫిక్
కొండాపూర్లోని కొత్తగూడ కూడలి, గచ్చిబౌలి పైవంతెన కూడలి, నాగోల్ రోడ్డు, శిల్పా లేఅవుట్, పాతబస్తీ రోడ్డు మార్గం, ఇతరత్రా ప్రాంతాల్లోనూ పైవంతెనల నిర్మాణ పనులు చాలా రోజులుగా కొనసాగుతున్నాయి. ఉప్పల్ కూడలిలో శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా ఇటుక వేయలేదు. బల్దియా ఖజానాలో నిధుల్లేకపోవడమే కారణమనే విమర్శలున్నాయి. ఇంజినీరింగ్ విభాగం మాత్రం గుత్తేదారులదే నిర్లక్ష్యమంటోంది. ప్రాజెక్టు వ్యయం పూర్తిగా భరించే సామర్థ్యం తమకుందని అంగీకరిస్తూ గుత్తేదారులు టెండరులో పాల్గొంటారు. అందుకు భిన్నంగా, ఒకటిరెండు నెలలు బిల్లులు నిలిచాయిని మొత్తంగా పనులు ఆపేస్తున్నారని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.