నిధుల్లేవంటూ..నిత్యం నరకం చూపిస్తూ!
చింతలేని రహదారుల వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభించిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కష్టాల్లో పడింది. ప్రధాన నగరంలోని కీలక రహదారులపై చేపట్టిన పైవంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లపై పడుతున్న గుంతలను
పైవంతెనల నిర్మాణంలో గుత్తేదారుల నిర్లక్ష్యం
బిల్లులు ఆలస్యమంటూ నత్తనడకన ‘ఎస్సార్డీపీ’ పనులు
అస్తవ్యస్తంగా మారిన రోడ్లు
ఈనాడు, హైదరాబాద్
చింతలేని రహదారుల వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభించిన ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కష్టాల్లో పడింది. ప్రధాన నగరంలోని కీలక రహదారులపై చేపట్టిన పైవంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లపై పడుతున్న గుంతలను అలాగే వదిలేస్తూ, బారికేడ్లు ఏర్పాటు చేయకుండా పనులు చేస్తున్నారు. గడువు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. గుత్తేదారులు, ఇంజినీర్ల నిర్లక్ష్యంతో ఆయా రోడ్లపై పౌరులు నిత్యం నరకం చూస్తున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని గుత్తేదారులు, చిన్న చిన్న కారణాలకే కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఇంజినీర్లు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని, లేకుంటే మరో రెండేళ్లు రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్ చౌరస్తా, నాగోల్, సాగర్ రింగు రోడ్డు-ఎయిర్పోర్టు మార్గం, ఆర్టీసీ క్రాసురోడ్డు, చంచల్గూడ జైలు రోడ్డు, ఆరాంఘర్ రహదారి, కొండాపూర్ రోడ్డు, గచ్చిబౌలి చౌరస్తా, ఇతరత్రా రోడ్డు మార్గాల్లో జనాలు అవస్థలు పడాల్సిందేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆర్టీసీ క్రాసు రోడ్డు ఆందోళనకరంగా..
ఆర్టీసీ క్రాస్రోడ్డు సమీపంలో పడిన గోతుల్లో నిలిచిన నీరు
వీఎస్టీ కూడలి నుంచి ఇందిరా పార్కు వరకు నాలుగు లైన్ల ఉక్కు వంతెన పనులు రెండున్నరేళ్ల కిందట మొదలయ్యాయి. ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా ఇంకా 50శాతం దాటలేదు. పిల్లర్ల నిర్మాణమూ అంతంతే. మూడు నెలల కిందట వీఎస్టీ కూడలి వద్ద ర్యాంపు కోసం తవ్విన గుంతలు అలాగే ఉన్నాయి. రోజువారీ పురోగతి 0.5శాతం కూడా ఉండట్లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. బిల్లులు ఆలస్యమంటూ గుత్తేదారు నత్తనడకన పనులు చేస్తున్నారు. దీంతో విద్యానగర్ నుంచి లోయర్ ట్యాంక్బండ్ రోడ్డులో ప్రయాణించేవారు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక్కడి హోటళ్లు, థియేటర్లకు వచ్చేవారు రోడ్లపై వాహనాలు నిలుపుతుండటంతో రాకపోకలు మరింత క్లిష్టంగా మారాయి.
పైవంతెన పొడవు.. 2.8 కి.మీ.
ప్రాజెక్టు వ్యయం.. రూ.356 కోట్లు
నల్గొండ క్రాసు రోడ్డు నుంచి యాతనే
సంతోష్నగర్లో ఇరుకుగా మారిన రహదారి
రెండున్నరేళ్ల కిందట నల్గొండ ఎక్స్రోడ్డు పైవంతెన నుంచి ఒవైసీ ఆస్పత్రి కూడలి వరకు ఉక్కు వంతెన నిర్మాణం మొదలైంది. రెండేళ్లలో పూర్తవ్వాలనేది నిబంధన. బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తున్నారంటూ గుత్తేదారు నెమ్మదిగా పనులు చేస్తున్నారు. ఇంకా సగం పూర్తికాలేదు. రోడ్డంతా తవ్వేసి వదిలేశారు. మూడు కి.మీ. పొడవునా మట్టి కుప్పలు, గుంతలే కనిపిస్తున్నాయి. భూసేకరణలో భాగంగా నిర్మాణాలను పూర్తిగా తొలగించలేదు. సర్వీసు రోడ్డు ఆక్రమణల్లోనే ఉంది. ప్రయాణికుల వాహనాలు కిలోమీటరు ప్రయాణించేందుకు 20 నిమిషాలు పడుతోంది.
పైవంతెన పొడవు.. 3.38 కి.మీ.
ప్రాజెక్టు వ్యయం.. రూ.523.37 కోట్లు
ఆరాంఘర్ చౌరస్తా వరకు విధ్వంసం
జూ నుంచి ఆరాంఘర్ మధ్య లేస్తున్న దుమ్ము
రెండేళ్ల కిందట జూ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పైవంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంలోని పొడవైన పైవంతెనల్లో ఇది రెండోది. 2023లో పనులు పూర్తవ్వాలనేది నిబంధన. నత్తనడకన సాగుతుండటంతో రెండేళ్లు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు జరుగుతోన్న ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. పిల్లర్ల గుంతల వద్ద బారికేడ్లు ఉండట్లేదు. సూచిక బోర్డులు లేవు. సర్వీసు రోడ్డు పునరుద్ధరించలేదు.
పైవంతెన పొడవు.. 4 కి.మీ.
ప్రాజెక్టు వ్యయం.. రూ.636.80 కోట్లు
అన్ని ప్రాంతాల్లో అదే తీరు
ఎల్బీనగర్ నాగోల్ మధ్య స్తంభించిన ట్రాఫిక్
కొండాపూర్లోని కొత్తగూడ కూడలి, గచ్చిబౌలి పైవంతెన కూడలి, నాగోల్ రోడ్డు, శిల్పా లేఅవుట్, పాతబస్తీ రోడ్డు మార్గం, ఇతరత్రా ప్రాంతాల్లోనూ పైవంతెనల నిర్మాణ పనులు చాలా రోజులుగా కొనసాగుతున్నాయి. ఉప్పల్ కూడలిలో శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా ఇటుక వేయలేదు. బల్దియా ఖజానాలో నిధుల్లేకపోవడమే కారణమనే విమర్శలున్నాయి. ఇంజినీరింగ్ విభాగం మాత్రం గుత్తేదారులదే నిర్లక్ష్యమంటోంది. ప్రాజెక్టు వ్యయం పూర్తిగా భరించే సామర్థ్యం తమకుందని అంగీకరిస్తూ గుత్తేదారులు టెండరులో పాల్గొంటారు. అందుకు భిన్నంగా, ఒకటిరెండు నెలలు బిల్లులు నిలిచాయిని మొత్తంగా పనులు ఆపేస్తున్నారని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
[ 08-05-2024]
రెండ్రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
[ 08-05-2024]
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
నాలాలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు
[ 08-05-2024]
నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వద్ద ఈ మృతదేహాలను గుర్తించారు. -
హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
[ 08-05-2024]
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. -
రాజకీయాలకు కేరాఫ్.. కేపీహెచ్బీ టెంపుల్ బస్టాపు
[ 08-05-2024]
ఎన్నికలొచ్చాయంటే 45ఏళ్ల చరిత్ర గల కేపీహెచ్బీ టెంపుల్ బస్టాపు పేరు మార్మోగుతుంది. ఏ పార్టీ నాయకులైనా ఎన్నికల సమయంలో ఈ బస్టాపు కేంద్రంగానే రాజకీయాలు చేస్తుంటారు. -
ఒక్క వానకే.. వణికె
[ 08-05-2024]
అకాలవర్షం నగరంపై విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో అస్తవ్యస్తం చేసింది. నిప్పుల కుంపటిలా మారిన నగరానికి వరుణుడు ఉపశమనం కలిగించినా.. విద్యుత్తు తీగలు తెగటం, చెట్లకొమ్మలు విరిగిపడడం.. ట్రాఫిక్ స్తంభించి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఆ వైభవం చూడాలని.. భుజానికెత్తుకొని
[ 08-05-2024]
మహానగరం పరిధిలోని లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో బస్సు యాత్రలో ఉంటే మరో నేత హరీశ్రావు మెదక్ లోక్సభ మీద దృష్టి పెట్టారు. -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ చర్యలు
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. 5 లోక్సభ నియోజకవర్గాల్లో విస్తరించిన కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు. -
ఓటుతో దేశభక్తి చాటండి
[ 08-05-2024]
ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ నగరవాసులకు పిలుపునిచ్చారు. -
ఏడుగురు ఎమ్మెల్యేలు మా వాళ్లే.. ఎంపీ సీటు మాదే
[ 08-05-2024]
‘మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్ నియోజకవర్గం. ఇదో మినీ ఇండియా. భిన్న ప్రాంతాల వారున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు, అన్నిరంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. మెట్రో కావాలనే ఆకాంక్ష ఎక్కువ ప్రాంతాల నుంచి వినబడుతోంది. -
ఇంజినీర్ను.. విజన్ ఉంది.. సాంకేతికతతో అభివృద్ధి చేస్తా
[ 08-05-2024]
‘‘దేశంలోని లోక్సభ స్థానాల్లో చేవెళ్ల వైవిధ్యమైనది. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగా మరికొన్నిచోట్ల కనీస సౌకర్యాల్లేవ్. ఐటీ, రియల్ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రాంతాలు కొన్నైతే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాలు కొన్ని. -
ఓటరు స్లిప్పుల పంపిణీలో అలసత్వం
[ 08-05-2024]
గ్రేటర్లో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఒకవైపు డిజిటల్ ఫొటో ఓటర్ స్లిప్పులు పంపిణీని వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంతో ఇవి ఇంకా ఓటర్లకు చేరడం లేదు. -
ఎన్నికల రద్దీకి అనుగుణంగా బస్సులు
[ 08-05-2024]
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఓటర్లను స్వస్థలాలకు తీసుకువెళ్లడం మా భాద్యత అంటున్నాయ్ ఆర్టీసీలు. ఏపీలో ఓటు న్న నగరవాసులు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ బి.రాజు తెలిపారు. -
పట్నం సునీతారెడ్డిపై సీఈఓకు ఫిర్యాదు
[ 08-05-2024]
మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్కు సంబంధించి వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోలకు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ భాజపా నేతలు ఎన్.రామచందర్రావు, గోకుల రామారావు తదితరులు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఏ అవకాశం వదిలేది లే..!
[ 08-05-2024]
చేవెళ్ల, మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు విజయం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. -
శత శాతం ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం లక్ష్యం. దీంతో ‘శత శాతం’ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటర్లను కార్యోన్ముఖులను చేస్తున్నారు. -
అవినీతిలో భారాస, కాంగ్రెస్ ఒకటే
[ 08-05-2024]
అవినీతిలో భారాస, కాంగ్రెస్ల మధ్య తేడా ఏమీ లేదని తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై అన్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం రాత్రి ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఫైట్) ఆధ్వర్యంలో అన్నామలై, చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో లెట్స్ యునైట్ వికసిత్ భారత్ పేరుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అక్కను నిత్యం వేధిస్తున్నాడని బావ హత్య
[ 08-05-2024]
అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి యోగేందర్(40)కు ఇద్దరు కుమార్తెలు. -
హామీలు అమలు చేసి తీరతాం: కాంగ్రెస్
[ 08-05-2024]
పరిగి, కొడంగల్ పక్కపక్కనే ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నేను (ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి) తోడు పెళ్లి కొడుకుని. ఆయనకు వచ్చే లడ్డూ (అభివృద్ధి ఫలాల్లో)ల్లో నాకు ఎక్కువగానే అందుతాయి. వాటిని మీకు తినిపించడానికి అవకాశం కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి అన్నారు. -
మళ్లీ మునుపటి పరిస్థితులు పునరావృతం
[ 08-05-2024]
తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
భారాస చేసిన అభివృద్ధి చూసి ఓటేయండి
[ 08-05-2024]
రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని మాజీ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పరిగి అసెంబ్లీ ఇంఛార్జి గట్టు రాంచందర్రావు అన్నారు. -
పాలమూరుకు ఏంచేశారో సీఎం చెప్పాలి: అరుణ
[ 08-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని పాలమూరు లోక్సభ భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ వచ్చిన ఆమె స్థానిక అంబేడ్కర్ కూడలిలో మాట్లాడుతూ పాలమూరుకు రేవంత్రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. -
ప్రత్యర్థులు ఒక్కటయ్యారు
[ 08-05-2024]
రాజకీయంలో శాశ్వత శత్రువులు.. మిత్రులుండరు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో పలువురు నేతల వ్యవహారం దీనికి అద్దం పట్టేలా మారింది. మొన్నటి వరకు కత్తులు దూసుకుని.. ఆగర్భ శత్రువుల్లా మెలిగిన నేతలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందికి చేరారు. -
కాంగ్రెస్, భారాసలకు కాలం చెల్లింది: కొండా
[ 08-05-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్, భారాసలకు కాలం చెల్లిందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లో ఆయన సమక్షంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 6వ డివిజన్ కార్పొరేటర్ మమతప్రవీణ్ తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. -
నూతన ఆవిష్కరణలతో ముందుకు..
[ 08-05-2024]
డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ ‘కాన్స్టెల్లి’ 6వ వార్షికోత్సవం టీహబ్లో జరిగిందని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హై ఫిడిలిటీ, సిమ్యులేషన్ సొల్యూషన్స్లో ప్రముఖ ప్రొవైడర్ అయిన కాన్స్టెల్లి పోరాట విమానాలు, నిఘా విమానాలు, డ్రోన్లు, వార్ఫేర్ సిస్టమ్, మైక్రోవేవ్ పేలోడ్లలో ప్రోగ్రాం జాప్యాలను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తోంది. -
కన్హా శాంతివనంలో గ్లోబల్ టీన్స్ మీట్ ప్రారంభం
[ 08-05-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ధ్యాన మందిరంలో గ్లోబల్ టీన్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. ఈ మీట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 500 మంది యువత ప్రత్యక్షంగా, వర్చువల్గా వేల మంది పాల్గొన్నారు. -
కష్టసుఖాలు ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణం
[ 08-05-2024]
కష్టాలు, సుఖాలున్నప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనరెడ్డి అన్నారు. -
మన కారు.. ఎవరూ పోటీ పడలేరు
[ 08-05-2024]
సికింద్రాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ నాంపల్లి నియోజకవర్గంలో రోడ్షోలో పాల్గొన్నారు. ఓటర్లకు కారు బొమ్మను చూపిస్తూ భారాసకు ఓటేయాల్సిందిగా స్థానికులను అభ్యర్థించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీఎఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!