అనుమతుల్లేకుండా.. విద్యుత్తు ఆటోల అమ్మకాలు!
విద్యుత్తు వాహనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు, అనుమతులను నగరంలో కొందరు వాహనాల డీలర్లు సొంత లాభాలకు వినియోగించుకుంటున్నారు. ఈ-ఆటోలు విక్రయించేందుకు రవాణాశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.
గూడ్స్ బండ్ల పేరుతో విక్రయం
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు వాహనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు, అనుమతులను నగరంలో కొందరు వాహనాల డీలర్లు సొంత లాభాలకు వినియోగించుకుంటున్నారు. ఈ-ఆటోలు విక్రయించేందుకు రవాణాశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. గూడ్స్ ఆటోలు విక్రయించేందుకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న నిబంధనల సాకుతో గూడ్సు వాహనాల తరహలోనే ప్యాసింజర్ ఆటోలను విక్రయిస్తున్నారు. కొద్దినెలల నుంచి మహీంద్ర, పియా జియో, ఈ-రిషాలతోపాటు మరికొన్ని కంపెనీలు విద్యుత్తు ఆటోలను విక్రయిస్తున్నాయి. కాలుష్య రహితం, శబ్దం లేకుండా రహదారులపై వెళ్తుండడం, ఎల్పీజీ ధర పెరుగుతుండడం వంటి కారణాలతో ఆటోడ్రైవర్లు ఈ-ఆటోలను కొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఈ-ప్యాసింజర్ ఆటోలు రిజిస్ట్రేషన్కు వస్తుండంతో రవాణాశాఖ అధికారులు వీటిపై దృష్టి కేంద్రీకరించారు. అనుమతులు లేకుండా ఈ-ఆటోలు విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామంటూ హెచ్చరించారు.
ఆన్లైన్లో దరఖాస్తు అవసరం
నగరంలో గూడ్స్ ఆటోలు వందల్లోనే ఉన్నాయి. రవాణాశాఖ నుంచి అనుమతి(లైసెన్స్) లేకుండా నగరంలో కొందరు డీలర్లు ప్యాసింజర్ ఆటోలను విక్రయిస్తున్నారు. ఈ-ప్యాసింజర్ ఆటోను కొనాలంటే ముందుగా రవాణాశాఖ అనుమతి పొందాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రవాణాశాఖ అధికారులు దరఖాస్తుదారుడి వివరాలు, లైసెన్సును పరిశీలించి ఆటోను కొనేందుకు అనుమతులిస్తారు. ఆటోను కొన్నాక అనుమతి పత్రంతో రవాణాశాఖ అధికారులను సంప్రదిస్తే ఈ-ఆటోకు రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ప్రత్యేక నంబర్ ప్లేట్ను కేటాయిస్తారు.
నిషేధం ఉన్నందుకే.. హైదరాబాద్లో డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ కొత్త ఆటోలపై ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం నిషేధం విధించింది. ఆటోల ద్వారా కాలుష్యం పెరిగిపోతోందన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే కొందరు డీలర్లు రవాణా శాఖ దృష్టి పడకుండా ఈ-గూడ్స్ ఆటోల పేరుతో అమ్మేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరద పారే దారేది..?
[ 21-05-2024]
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు. -
పిడుగుపాటుకు మరొకరి మృతి
[ 21-05-2024]
జిల్లాలో తాండూరు, కొడంగల్ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?
[ 21-05-2024]
కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. -
పెట్టుబడులకు లాభాలంటూ మోసం
[ 21-05-2024]
ఆయుర్వేదిక్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. -
వానమ్మా.. వానమ్మా ఈ కష్టాలు ఏంటమ్మా
[ 21-05-2024]
వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు
[ 21-05-2024]
కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్ కీర్తించారు. -
తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు
[ 21-05-2024]
తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్బాబు కీర్తించారు. -
ఆధ్యాత్మికతకు పట్టం కట్టేలా అక్షరాలు
[ 21-05-2024]
త్యాగరాయ గానసభ నిర్వహణలో ఆధ్యాత్మికవేత్త పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం...వీరం’ గ్రంథావిష్కరణ సోమవారం రాత్రి జరిగింది. -
ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణకు మంత్రి హామీ
[ 21-05-2024]
తెలంగాణలోని ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు వడ్డేపల్లి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 21-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్