icon icon icon
icon icon icon

Loksabha polls: అమితాబ్‌ తర్వాత అంతటి గౌరవం దక్కింది నాకే : కంగనా

సినీ పరిశ్రమలో తాను అమితాబ్‌ బచ్చన్‌తో సమానమైన గౌరవాన్ని పొందానని కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Published : 06 May 2024 12:47 IST

దిల్లీ: సినీ పరిశ్రమలో తాను ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌తో సమానంగా  గౌరవాన్ని, ప్రేమను పొందానని సినీనటి, భాజపా మండి అభ్యర్థి కంగనా రనౌత్ పేర్కొన్నారు. ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కంగన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. “నేను రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, దిల్లీ, మణిపూర్‌ ఇలా దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. అమితాబ్‌ బచ్చన్‌ తర్వాత సినీ పరిశ్రమలో అంతటి గౌరవాన్ని, ప్రేమను పొందింది నేనే అని ధైర్యంగా చెప్పగలను. ’’అని కంగన తనను బిగ్‌ బీతో పోల్చుకున్నారు. 

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి  కంగనా భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సినీ నటిగా మంచి గుర్తింపు పొందిన కంగన  నటించిన ‘ఎమర్జెన్సీ’చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img