యాదవ్ల కంచుకోటలో బిహార్ సీఎం నీతీశ్కు పరీక్ష..!
మాధేపుర నియోజకవర్గంలో మరోసారి జేడీయూ అభ్యర్థిని గెలిపించుకోవడం.. బిహార్ సీఎం నీతీశ్కుమార్ నాయకత్వానికి పరీక్షగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్లో ఆ నియోజకవర్గం యాదవ్ల కంచుకోట. అక్కడ 1967 నుంచి యాదవేతరులు ఒక్కసారి కూడా గెలవలేదు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ నేతృత్వం వహించిన ఈ స్థానం.. ప్రస్తుతం బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్కు రాజకీయ పరీక్షగా నిలవనుంది. అదే మాధేపుర నియోజకవర్గం.
ఒకప్పుడు ఆర్జేడీకి కంచుకోట..
ఈ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షలకుపైగా ఓటర్లు ఉండగా.. దాదాపు 5 లక్షల మంది యాదవ్లు, రెండు లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండేది. 2009లో లాలూ యాదవ్ పక్కకు తప్పుకోవడంతో అది మారిపోయింది. అయితే.. 2014లో మోదీ సునామీలో కూడా ఈ స్థానాన్ని ఆర్జేడీ తిరిగి కైవసం చేసుకుంది. 2019లో మోదీ ఫ్యాక్టర్ కారణంగా యాదవ్ ఓటర్లు జేడీయూ అభ్యర్థి దినేశ్ యాదవ్వైపు నిలవడంతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయనే మరోసారి ఆ పార్టీ తరఫున బరిలో ఉన్నారు.
నీతీశ్కు పరీక్ష ఎందుకంటే..?
ఈ నియోజకవర్గంలో విజయం నీతీశ్ నాయకత్వానికి పరీక్షగా మారింది. సిటింగ్ ఎంపీగా ఉన్న దినేశ్ యాదవ్పై వ్యతిరేకత ఉందని.. ఆయనకు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదని భాజపా నేతలు చెబుతున్నారు. మోదీ ఆదరణ, రాజ్పుత్లు, ఓబీసీల మద్దతు భాజపాకు ఉన్నప్పటికీ.. యాదవ్ల నుంచి వ్యతిరేకత ఇక్కడ ఎన్డీఏ కూటమికి నష్టం కలిగించొచ్చని కమలం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఇక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకోవడం బిహార్ సీఎంకు పరీక్షగా మారింది. తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో మద్దతు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
‘‘ఇక్కడ యాదవ్లు ఎక్కువ. వారంతా ఒకప్పుడు ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ.. 2009లో నీతీశ్ కుమార్కు ఉన్న ఆదరణతో జేడీయూ అభ్యర్థిగా శరద్ యాదవ్ గెలుపొందారు. 2019లో మోదీ పాపులారిటీతో దినేశ్ యాదవ్ విజయం సాధించారు. అయితే.. అప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. మంచి అడ్మినిస్ట్రేటర్ అనే ఇమేజ్ నీతీశ్కు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందా?’’ అనేదే ఇక్కడ ప్రశ్న అని ఓ భాజపా నేత పేర్కొన్నారు. అందుకే ఈ స్థానంలో విజయం బిహార్ సీఎంకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ ఆర్జేడీ నుంచి కుమార్ చంద్రదీప్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మూడో విడతలో భాగంగా మే7న పోలింగ్ జరగనుంది.
2019లో మొత్తం 40 సీట్లలో 39 గెలుచుకున్న ఎన్డీఏ కూటమి ఇప్పుడు గంగా నదికి దక్షిణ ప్రాంతంలో, రాష్ట్రంలో ఉత్తర భాగాన ఉన్న ప్రాంతాల్లో ఇండియా కూటమి మహాగఠ్బంధన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?