icon icon icon
icon icon icon

భాజపాలోకి దిల్లీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు

దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్‌ సింగ్‌ లవ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి సమక్షంలో శనివారం ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.

Published : 04 May 2024 17:33 IST

దిల్లీ: దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (DPCC) అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్‌ సింగ్‌ లవ్లీ భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి సమక్షంలో శనివారం ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. పార్టీ పదవికి రాజీనామా చేసిన రోజు తాను ఏ పార్టీలోనూ చేరబోనంటూ పేర్కొన్న ఆయన.. వారం తిరగకముందే భాజపాలో చేరడం గమనార్హం. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు సైతం భాజపాలో చేరారు. 

లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో జట్టు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ అర్విందర్‌ సింగ్‌ లవ్లీ తన పదవికి ఇటీవల రాజీనామా చేశారు. ఆప్‌తో పొత్తు కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అసత్య, కల్పిత, దురుద్దేశ అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్‌ను నాశనం చేయడానికే ఆప్‌ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన రోజున తనకు ఇష్టం లేకపోయినా అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img