icon icon icon
icon icon icon

పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన బాలుడు!

ప్రస్తుతం దేశంలో దశల వారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ పూర్తయింది.

Published : 10 May 2024 06:55 IST

దిల్లీ: ప్రస్తుతం దేశంలో దశల వారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ పూర్తయింది. ఈ క్రమంలో ఒక పోలింగ్‌ కేంద్రంలో ఓ బాలుడు ఓటు వేస్తోన్న వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలోని బెరాసియా ప్రాంతానికి చెందిన భాజపా నాయకుడు వినయ్‌ మెహర్‌.. తన మైనర్‌ కుమారుడితో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. తన తండ్రి స్థానంలో ఆ పిల్లాడు ఈవీఎం బటన్‌ నొక్కి భాజపాకు ఓటు వేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాంతో ఇవి కాస్తా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ దృష్టికి చేరాయి. ‘‘భాజపా.. ఎన్నికల సంఘాన్ని పిల్లల ఆట వస్తువుగా మార్చింది. భాజపా నేత వినయ్‌ మెహర్‌ తన ఓటును కుమారుడితో వేయించారు. ఆ తతంగాన్ని వీడియో తీసి, ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పిల్లల్ని, మొబైల్‌ ఫోన్లను లోపలికి ఎలా అనుమతించారు..? దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయా..?’’ అని కమల్‌నాథ్‌ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నుంచి ఈ విషయమై స్పందన రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img