Telangana Elections 2023: మీది గూగుల్ పేనా.. ఫోన్ పేనా
ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటుతోనే ఓడిన, గెలిచిన సందర్భాలు అనేకమున్నాయి. అందుకే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి ఉద్యోగ, ఉపాధి పొందుతున్న వలస ఓటర్లపై రాజకీయ పార్టీల కన్ను పడింది.
రానుపోనూ ఖర్చులు మావే..
వలస ఓట్లపై పార్టీల దృష్టి
ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటుతోనే ఓడిన, గెలిచిన సందర్భాలు అనేకమున్నాయి. అందుకే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి ఉద్యోగ, ఉపాధి పొందుతున్న వలస ఓటర్లపై రాజకీయ పార్టీల కన్ను పడింది. ఎలాగైనా వారిని గ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓట్లు మలుచుకునేందుకు పార్టీల నాయకులు శ్రీకారం చుట్టారు.
కోటపల్లి (చెన్నూరు), న్యూస్టుడే: జిల్లాలో తమ పరిధిలో ఉన్న ఓటర్లు ఎక్కడున్నా సరే రప్పించి ఓట్లు వేయించుకుంటే తమ అభ్యర్థికి మెజార్టీ పెరుగుతుందనే కోణంలో వలస ఓట్లపై దృష్టి సారిస్తున్నారు. రానుపోనూ ఖర్చులు మావే ఆ పై రోజంతా ఖర్చు మాదేనంటూ ఫోన్లల్లో ఎరవేస్తున్నారు. ఇక్కడి బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారా వారి ఫోన్ నెంబర్లను సేకరించి మాట్లాడటమే కాకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామాలకు వచ్చి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతే కాదండోయ్ పైగా ఆయా ఫోన్ నెంబర్లకు ఫోన్పే, గూగుల్ పే ఉందా అంటూ ఆరా తీస్తున్నారు. పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రతీ ఓటు ముఖ్యమైనదే కావడం వల్ల ముందే పనిలో పనిగా డబ్బులు సైతం ఫోన్పే ద్వారా చెల్లిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం గ్రామాలకు దూరంగా ఉన్న వారికి ఫోన్ చేసి మామా, అన్న, బావ, అక్కా, చెల్లి అంటూ వరుసలతో పలకరిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడ్డారు. తామే ముందుగా పలకరించి ఓటు వేయడానికి రమ్మనడంతో పాటు తీరా ఖర్చులన్నీ అందిస్తే ఆ ఓటు తమకే పక్కా పడుతుందని నాయకులు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణాలకు వలస పోయిన వారికి ఫోన్లు చేస్తూ సమాచారం అందించడం తమ గుర్తింపు కార్డుల క్రమ సంఖ్య చెప్పడం లాంటి పనులతో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు ఓట్ల వేటలో పడ్డారు.
- చెల్లెమ్మ బావను ఎలాగైనా ఒప్పించి ఎన్నికల రోజున గ్రామానికి వచ్చి మా పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలి. ఇందుకోసం అయ్యే ఖర్చులు మేమే భరిస్తాం.. అంటూ కోటపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రధాన పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడు హైదరాబాద్లో ఉంటున్న వారిని ఫోన్లలో సంప్రదిస్తున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?