icon icon icon
icon icon icon

Harish Rao: మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: హరీశ్‌రావు

భారాస ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చినట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు గుర్తు చేశారు.

Updated : 05 May 2024 11:14 IST

హనుమకొండ: భారాస ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చినట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ద్వారా 11 విడతల్లో రైతులకు రూ.72 వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలన్నీ విమర్శించారు. రేవంత్‌ ఎక్కడికిపోతే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయాలని కోరిన కేసీఆర్‌ను సీఎం దుర్భాషలాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే పదవి కంటే ప్రజల సంతోషమే తనకు ముఖ్యమన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా’’ అని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img