icon icon icon
icon icon icon

Harishrao: కాంగ్రెస్‌ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారు: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

Published : 10 May 2024 11:19 IST

హుస్నాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారని.. 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. భారాస హయాంలో విద్యుత్‌ నిరంతరం ఉండేదని.. ఇప్పుడు నిత్యం సరఫరా నిలిచిపోతోందన్నారు. రైతులు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

‘‘పెళ్లి చేసుకున్న వాళ్లకు తులం బంగారం ఇస్తామన్న హామీ అమలు కాలేదు. పైగా కాంగ్రెస్‌ వచ్చాక బంగారం ధరలు కొండెక్కాయి. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లేదు. పొలాల వద్ద మోటార్లు కాలిపోతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ ఇవ్వడంలేదు. ప్రియాంక గాంధీ గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్‌కు వచ్చినప్పుడు తాము గెలిస్తే ఇక్కడ మెడికల్‌ కళాశాల ఇస్తామన్నారు.. ఆ హామీ ఏమైంది? రాహుల్ గాంధీ ఇటీవల మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేశామన్నారు. రాహుల్‌ గాంధీ అబద్ధాల గాంధీగా మారారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతు బంధు, ధాన్యానికి రూ.500 బోనస్‌ రాలేదు’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img